Paris Olympics 2024: సెమీఫైనల్‌కు చేరిన లక్ష్యసేన్..! ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన భారత షట్లర్..

|

Aug 03, 2024 | 8:27 AM

Paris Olympics 2024: యువ షట్లర్ లక్ష్య సేన్ పారిస్ ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనతో భారత అభిమానులకు శుభవార్త అందించాడు. బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్‌లోకి అడుగుపెట్టిన లక్ష్యసేన్‌ చరిత్ర సృష్టించాడు. దీంతో ఒలింపిక్‌ చరిత్రలో సెమీఫైనల్‌కు చేరిన తొలి భారత పురుష అథ్లెట్‌గా రికార్డు సృష్టించాడు.

Paris Olympics 2024: సెమీఫైనల్‌కు చేరిన లక్ష్యసేన్..! ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన భారత షట్లర్..
Lakshya Sen
Follow us on

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనతో భారత అభిమానులకు యువ షట్లర్ లక్ష్యసేన్ శుభవార్త అందించాడు. బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్‌లోకి అడుగుపెట్టిన లక్ష్యసేన్‌ చరిత్ర సృష్టించాడు. దీంతో ఒలింపిక్‌ చరిత్రలో సెమీఫైనల్‌కు చేరిన తొలి భారత పురుష అథ్లెట్‌గా రికార్డు సృష్టించాడు. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో చైనీస్ ఆటగాడు 19-21, 21-15, 21-12తో చైనీస్ తైపీకి చెందిన చౌ టియెన్ చెన్‌ను ఓడించి సెమీ-ఫైనల్‌కు టికెట్ దక్కించుకున్నాడు. లక్ష్య సేన్ ఇప్పుడు పతకానికి కేవలం ఒక విజయం దూరంలో ఉన్నాడు. లక్ష్య కంటే ముందు కిదాంబి శ్రీకాంత్ (2016), పారుపల్లి కశ్యప్ (2012) క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. అయితే, ఈ ఇద్దరు ఆటగాళ్లు క్వార్టర్‌ ఫైనల్స్‌కు మించి ముందుకు సాగలేకపోయారు.

సెమీఫైనల్‌‌కు చేరిన లక్ష్య సేన్..

అత్యంత ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇద్దరు ఆటగాళ్ల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఇద్దరు షట్లర్లు ఒక్కో పాయింట్ సాధించేందుకు ఇబ్బంది పడుతున్నట్లు కనిపించింది. చైనీస్ తైపీకి చెందిన చౌ తియెన్ చెన్ తొలి సెట్‌లో ఆధిపత్యం ప్రదర్శించి 21-19తో తొలి సెట్‌ను కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత లక్ష్య రెండో సెట్‌లో పునరాగమనం చేసి 21-15తో మ్యాచ్‌ను సమం చేశాడు. దీంతో మూడో సెట్‌లో ఉత్కంఠ నెలకొంది. చివరకు లక్ష్య 21-12తో మూడో సెట్‌ను కైవసం చేసుకుని సెమీఫైనల్‌లోకి ప్రవేశించాడు.

ఇవి కూడా చదవండి

ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ ప్రత్యర్థి..

పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్‌లో లక్ష్యసేన్ 21-12, 21-6తో భారత్‌కు చెందిన హెచ్‌ఎస్ ప్రణయ్‌పై గెలిచి క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించాడు. 21 నిమిషాల పాటు 21-12తో సాగిన తొలి సెట్‌ను కైవసం చేసుకున్న లక్ష్యసేన్ రెండో సెట్‌లోనూ బలమైన ప్రదర్శన చేసి 18 నిమిషాల పాటు సాగిన గేమ్‌లో 21-6తో ప్రణయ్‌పై విజయం సాధించాడు. ఈ మ్యాచ్ ఓటమితో ప్రణయ్ పారిస్ ఒలింపిక్స్ ప్రయాణం కూడా ముగిసింది. ఇప్పుడు బ్యాడ్మింటన్ విభాగంలో లక్ష్య సేన్ మాత్రమే భారత్‌కు పతకాల ఆశలు మిగిల్చాడు.

భారత్‌కు చివరి ఆశ..

ఎందుకంటే, నిన్న అంటే ఆగస్టు 1న జరిగిన బ్యాడ్మింటన్ ఈవెంట్‌లో దేశానికి పతకం ఖాయమన్న స్టార్ షట్లర్ పీవీ సింధు.. వరుసగా మూడో ఒలింపిక్ పతకం సాధించే అవకాశాన్ని చేజార్చుకుంది. ప్రిక్వార్టర్ ఫైనల్‌లోనే సింధు ఓటమి చవిచూడాల్సి వచ్చింది. పురుషుల డబుల్స్‌లోనూ సూపర్‌స్టార్‌ జోడీ సాత్విక్‌-చిరాగ్‌ జోడీకి ఓటమి ఎదురైంది. ఇటువంటి పరిస్థితిలో, ప్రీ-క్వార్టర్ ఫైనల్స్‌లో భారత వెటరన్ ప్లేయర్ హెచ్‌ఎస్ ప్రణయ్‌ను ఓడించి బ్యాడ్మింటన్‌లో లక్ష్యసేన్ భారతదేశానికి చివరి ఆశగా మారాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..