ధోనికి నిద్ర‌లో కూడా పబ్​జీ పిచ్చే..సాక్షి కంప్లైంట్..!

|

Jun 01, 2020 | 11:53 AM

క‌రోనా క‌ట్టడి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన‌ లాక్​డౌన్ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం ఇంట్లోనే ఉంటూ ఫ్యామిలీ మెంబ‌ర్స్ తో విలువైన స‌మ‌యాన్ని గ‌డుపుతున్నాడు టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ. అయితే అత‌డు ప‌డుకుని నిద్ర‌పోతున్న‌ప్పుడు కూడా పబ్​జీ గేమ్ గురించి కలవరిస్తున్నాడని చెప్పి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది ధోని భార్య సాక్షి సింగ్. చెన్నై సూపర్​కింగ్స్​ నిర్వ‌హించిన ఇన్​స్టాలో లైవ్​లో పాల్గొన్న ఆమె మహీ గురించి చాలా విషయాలు చెప్పింది. ‌”ధోని ఎప్పుడూ ఏదో ఒకటి థింక్ చేస్తూనే ఉంటాడు. […]

ధోనికి నిద్ర‌లో కూడా పబ్​జీ పిచ్చే..సాక్షి కంప్లైంట్..!
Follow us on

క‌రోనా క‌ట్టడి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన‌ లాక్​డౌన్ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం ఇంట్లోనే ఉంటూ ఫ్యామిలీ మెంబ‌ర్స్ తో విలువైన స‌మ‌యాన్ని గ‌డుపుతున్నాడు టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ. అయితే అత‌డు ప‌డుకుని నిద్ర‌పోతున్న‌ప్పుడు కూడా పబ్​జీ గేమ్ గురించి కలవరిస్తున్నాడని చెప్పి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది ధోని భార్య సాక్షి సింగ్. చెన్నై సూపర్​కింగ్స్​ నిర్వ‌హించిన ఇన్​స్టాలో లైవ్​లో పాల్గొన్న ఆమె మహీ గురించి చాలా విషయాలు చెప్పింది.

‌”ధోని ఎప్పుడూ ఏదో ఒకటి థింక్ చేస్తూనే ఉంటాడు. అతని మైండ్ కు రెస్ట్ లేదు. పబ్​జీ ఆడేట‌ప్పుడు మాత్రం అతడి మనసు మళ్లుతుంది. ఇటీవ‌లి కాలంలో బెడ్​పై కూడా ధోనీ ఆ గేమ్ గురించే ఆలోచిస్తున్నాడు. నిద్రలో సైతం పబ్​జీని కలవరిస్తున్నాడు” అని సాక్షి సింగ్ పేర్కొన్నారు.

అలానే లాక్​డౌన్ సమయంలో ధోని ఎక్కువ స‌మయాన్ని బైక్​లతో గడుపుతున్నాడని సాక్షి చెప్పింది. మ‌హీకి మొత్తం 9 బైకులు ఉన్నాయ‌ని..వాటికి సంబంధించిన కొత్త‌ స్పేర్ పార్ట్స్ ప్ర‌స్తుతం అమ‌ర్చుతున్నాడ‌ని వెల్ల‌డించింది. 38 ఏళ్ల ధోనీ చివరగా, గతేడాది జరిగిన వన్డే వ‌రల్డ్ క‌ప్ లో ఆడాడు. ఆ తర్వాత ఆటకు టెంప‌ర‌రీ విరామం ప్రకటించాడు. కాగా ధోని రిటైర్మెంట్ కు సంబంధించి రోజుకో వార్త షికారు చేస్తూనే ఉంటుంది.