India Vs England 2021: ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్.. టీమిండియాకు ఊహించని షాక్.. ఆ ఆటగాడు దూరం..

India Vs England 2021: ఆస్ట్రేలియాపై చిరస్మరణీయ విజయాన్ని అందుకున్న టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. వచ్చే నెల నుంచి...

India Vs England 2021: ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్.. టీమిండియాకు ఊహించని షాక్.. ఆ ఆటగాడు దూరం..

Updated on: Jan 21, 2021 | 7:24 PM

India Vs England 2021: ఆస్ట్రేలియాపై చిరస్మరణీయ విజయాన్ని అందుకున్న టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. వచ్చే నెల నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌కు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా దూరమయ్యాడు. ఆసీస్‌తో జరిగిన మూడో టెస్టులో జడేజా బొటన వేలికి గాయమైన సంగతి తెలిసిందే. దీనితో ఆస్ట్రేలియాలోనే అతడికి వైద్యులు సర్జరీ నిర్వహించారు. కనీసం ఆరు వారాల పాటు విశ్రాంతి అవసరమని సూచించారు.

దీనితో ఆ ఆరు వారాలు ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ముగిసేసరికి పూర్తవుతాయి. ఇక అనంతరం అతడికి ఫిట్‌నెస్ పరీక్ష పెట్టి సెలెక్టర్లు ఎంపిక చేస్తారు కాబట్టి.. జడేజా టెస్టులతో పాటు వన్డేలకు కూడా అందుబాటులో ఉండటం అనుమానమే. కాగా, ఆసీస్ పర్యటన ముగించుకుని గురువారం జడేజా కూడా టీమిండియాతో కలిసి స్వదేశం చేరుకున్నాడు. ఇక కొద్దిరోజుల తర్వాత రిహాబ్ కోసం జడ్డూను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి పంపించానున్నారు.

ఇంగ్లాండ్‌తో మొదటి రెండు టెస్టులకు ఎంపికైన జట్టు…

విరాట్ కోహ్లి (కెప్టెన్), అజింక్య రహానే (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, శుబ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సాహా (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ఇషాంత్ శర్మ, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్, శార్దుల్ ఠాకూర్