మహిళల టీ20 ప్రపంచ కప్నకు సంబంధించి ఐసీసీ కీలక ప్రకటన విడుదల చేసింది. 2023లో దక్షిణాఫ్రికాలో జగరనున్న మహిళల టీ20 వరల్డ్ కప్ అర్హత ప్రక్రియపై మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకల ప్రకారం.. మొత్తం 10 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటాయి. అయితే, ఆతిథ్య సౌతాఫ్రికాతో పాటు 2021, నవంబర్ చివరి నాటికి ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్లో టాప్-7లో ఉన్న జట్లు నేరుగా టీ20 వరల్డ్ కప్లో పోరుకు అర్హత సాధిస్తాయి. ఇక మిగిలిన బెర్త్ల కోసం క్వాలిఫైయింగ్ మ్యాచ్లను నిర్వహిస్తారు. ఈ మ్యాచ్లలో 37 జట్లు తలపబడనున్నాయి. ఇందులో ఫైనల్కు చేరిన జట్లకు వరల్డ్ కప్లో బెర్త్ దక్కుతుంది. కాగా, మయన్మార్, ఫ్రాన్స్, భూటాన్, మలావీ, బోట్సువానా, ఫిలిప్సీన్స్, టర్కీ, కామెరూన్, తొలిసారి ఐసీసీ క్వాలిఫికేషన్ ఈవెంట్లో పాల్గొననున్నాయి. ఇదిలాఉంటే.. 2022 నవంబర్-డిసెంబర్లో టీ20 మ్యాచ్లు జరగాల్సి ఉండగా, దానిని రీషెడ్యూల్ చేశారు. 2023 ఫిబ్రవరి 9 నుంచి 26 వరకు ఈ మెగా టోర్నీని నిర్వహించనున్నారు. 2021, ఆగస్టు నుంచి రీజనల్ స్థాయిలో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది.
Also Read: