AP Politics: మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ గోరంట్ల మాధవ్.. ఈసారి అగ్రకులాలు టార్గెట్‌గా హాట్ కామెంట్స్..

ఆంధ్రప్రదేశ్‌లో ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వం మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతుండగా.. మరోవైపు అధికార పార్టీ నేతలు తమ మాటలు, చేతలతో స్థానిక ...

AP Politics: మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ గోరంట్ల మాధవ్.. ఈసారి అగ్రకులాలు టార్గెట్‌గా హాట్ కామెంట్స్..
Follow us

|

Updated on: Dec 13, 2020 | 4:48 PM

AP Politics: ఆంధ్రప్రదేశ్‌లో ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వం మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతుండగా.. మరోవైపు అధికార పార్టీ నేతలు తమ మాటలు, చేతలతో స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధమవుతున్న కనిపిస్తోంది. వివాదాస్పద వ్యాఖ్యలతో వరుసగా వార్తల్లో నిలుస్తున్న హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్.. మరోసారి రెచ్చిపోయారు. ఈసారి ఉన్నత కులాలను టార్గెట్‌గా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నాడు కర్నూలు జిల్లాలోని కల్లూరు మండలం పెద్దపాడులో కురబల ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ గోరంట్ల మాధవ్ దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన మాధవ్.. రాయలసీమ జిల్లాలో కురబలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అగ్రవర్ణాలైన రెడ్లు, కమ్మల దౌర్జన్యాలపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాని మాధవ్ స్పష్టం చేశారు. అగ్రవర్ణాల వారు కురబలను బెదిరిస్తే వారికి అండగా తానుంటానని అన్నారు. అగ్రవర్ణాల వారు కురబలను ఇబ్బంది పెట్టొద్దని హెచ్చరించారు. కురబలు నాయకులుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. సీఎం జగన్‌కు అండగా కురబలు నిలవాలని పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కురబలు వైసీపీ వెంట నిలబడాలని, వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని ఎంపీ మాధవ్ విజ్ఞప్తి చేశారు.