Yashasvi Jaiswal : భారత క్రికెట్‌లో కొత్త సంచలనం..యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ

Yashasvi Jaiswal : భారత్, సౌతాఫ్రికా మధ్య విశాఖపట్నంలో జరుగుతున్న సిరీస్ నిర్ణయాత్మక మూడవ వన్డే మ్యాచ్‌లో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. సౌతాఫ్రికా నిర్దేశించిన 271 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జైస్వాల్ తన కెరీర్‌లో కేవలం నాలుగో వన్డే మ్యాచ్‌లోనే మొట్టమొదటి సెంచరీని నమోదు చేసి సంచలనం సృష్టించాడు.

Yashasvi Jaiswal : భారత క్రికెట్‌లో కొత్త సంచలనం..యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
Yashasvi Jaiswal

Updated on: Dec 06, 2025 | 8:33 PM

Yashasvi Jaiswal : భారత్, సౌతాఫ్రికా మధ్య విశాఖపట్నంలో జరుగుతున్న సిరీస్ నిర్ణయాత్మక మూడవ వన్డే మ్యాచ్‌లో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. సౌతాఫ్రికా నిర్దేశించిన 271 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జైస్వాల్ తన కెరీర్‌లో కేవలం నాలుగో వన్డే మ్యాచ్‌లోనే మొట్టమొదటి సెంచరీని నమోదు చేసి సంచలనం సృష్టించాడు. అతని సెంచరీతో భారత్ విజయానికి చేరువైంది.

శుభ్‌మన్ గిల్ గాయం కారణంగా జట్టులో చోటు దక్కించుకున్న జైస్వాల్, ఈ సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లలో (18, 22 పరుగులు) పెద్దగా రాణించలేకపోయాడు. కానీ కీలకమైన మూడో మ్యాచ్‌లో మాత్రం చెలరేగాడు. కార్బిన్ బాష్ వేసిన 36వ ఓవర్‌లోని రెండో బంతికి ఒక పరుగు తీసి, 111 బంతుల్లో తన తొలి వన్డే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ సెంచరీలో 10 ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి. దీంతో మూడు ఫార్మాట్‌లలో (టెస్టులు, టీ20, వన్డే) సెంచరీ సాధించని లోటును జైస్వాల్ భర్తీ చేశాడు. అంతకుముందు, జైస్వాల్ 75 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో తొలి వన్డే హాఫ్ సెంచరీ  కూడా పూర్తి చేసుకున్నాడు.

జైస్వాల్ తన సెంచరీకి చేరువవుతున్న సమయంలో వన్‌డౌన్‌లో వచ్చిన విరాట్ కోహ్లీ కూడా అతనికి అద్భుతమైన సహకారం అందించాడు. కోహ్లీ బ్యాటింగ్‌లో ఉన్నప్పుడు కార్బిన్ బాష్ వేసిన 34వ ఓవర్‌లో ఒక బౌండరీ కొట్టడంతో పాటు, వెంటనే నో లుక్ సిక్స్ తో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. 34 ఓవర్ల తర్వాత భారత్ స్కోరు 214/1 కి చేరుకుంది, అప్పటికి కోహ్లీ 30 పరుగులతో, జైస్వాల్ 96 పరుగులతో ఉన్నారు. ముందుగా అవుట్ అయిన ఓపెనర్ రోహిత్ శర్మ (75 పరుగులు) ఈ మ్యాచ్‌లోనే తన 27వ పరుగును పూర్తి చేయడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో 20,000 పరుగులు సాధించిన నాల్గవ భారత ఆటగాడిగా నిలిచాడు. ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ చెరో 4 వికెట్లు తీసి దక్షిణాఫ్రికా జట్టును 270 పరుగులకే ఆలౌట్ చేయడంతో భారత్ ఛేజింగ్‌లో బలమైన స్థితిలో ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us