AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WPL 2023: మంధాన నుంచి షెఫాలీ వరకు.. మిలియనీర్లుగా మారిన భారత మహిళా ఆటగాళ్లు.. ఎవరు ఎంత దక్కించుకున్నారంటే?

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో భారత మహిళల క్రికెట్ జట్టుకు చెందిన పలువురు క్రీడాకారులు కోటీశ్వరులు కావడంలో విజయం సాధించారు. ఇందులో టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన పేర్లు కూడా ఉన్నాయి.

WPL 2023: మంధాన నుంచి షెఫాలీ వరకు.. మిలియనీర్లుగా మారిన భారత మహిళా ఆటగాళ్లు.. ఎవరు ఎంత దక్కించుకున్నారంటే?
Wpl 2023
Venkata Chari
|

Updated on: Feb 13, 2023 | 4:46 PM

Share

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి సీజన్ వేలం ముంబై వేదికగా జరుగుతుండగా.. ఐదు జట్లు ఆటగాళ్లపై విపరీతంగా కాసుల వర్షం కురిపించాయి. భారత ఆటగాళ్లపైనా భారీ వర్షం కురుస్తోంది. భారత దిగ్గజ ఆటగాళ్లపై బోలెడంత డబ్బుల వర్షం కురుస్తోంది. కోటీశ్వరులుగా మారిన భారత ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

వీరిలో మొదటి పేరు భారత ఓపెనర్ స్మృతి మంధాన. ముంబై ఇండియన్స్‌తో పోరాడిన తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వారి జట్టులో మంధానను చేర్చుకుంది. మంధాన కోసం ఈ టీమ్ రూ.3.40 కోట్లు ఖర్చు చేసింది.

ఆ తర్వాత టీమ్ ఇండియా ఆల్ రౌండర్ దీప్తి శర్మపై అన్ని జట్లు కన్నేశాయి. చివరకు యూపీ వారియర్స్ తమ ఖజానాను తెరిచి రూ. 2.60 కోట్లతో దక్కించుకుంది.

భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌పై కూడా భారీ వర్షం కురిసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ కోసం ముంబై ఇండియన్స్ రూ.1.80 కోట్లు ఇచ్చింది.

భారత జట్టు ఫాస్ట్ బౌలర్ రేణుకా ఠాకూర్ కూడా కోటీశ్వరురాలిగా మారింది. బెంగళూరు రూ.1.50 కోట్లతో దక్కించుకుంది.

టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన జెమీమా రోడ్రిగ్జ్.. ఈ వేలంలో కోటీశ్వరురాలిగా మారింది. రూ.2.20 కోట్లకు ఢిల్లీ దక్కించుకుంది.

షెఫాలీ వర్మ తన తుఫాను బ్యాటింగ్‌కు ప్రసిద్ధి చెందింది. ఆమె కోసం ఢిల్లీ రూ.2 కోట్లు ఖర్చు చేసింది. ఢిల్లీ, ముంబై చివర వరకు పోరాడాయి.