కోహ్లీ ఆ రికార్డులు ఖతం చేస్తాడా?

|

Mar 23, 2019 | 4:43 PM

చెన్నై: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ సీజన్ రానే వచ్చింది.  ఈ సందర్భంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య నేడు మొదటి మ్యాచ్ జరగనుంది. కాగా ప్రపంచక్రికెట్‌లో ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన వన్డే వరల్డ్ నెంబర్ వన్ బ్యాట్స్‌మన్  కోహ్లీ  ఐపీఎల్‌లో కూడా మూడు రికార్డులకు అతి చేరువలో ఉన్నాడు. ఈరోజు చెన్నైతో మ్యాచ్‌లో ఈ ఏస్ బ్యాట్స్‌మన్ ఆ రికార్డుల అంతు చూస్తాడో, […]

కోహ్లీ ఆ రికార్డులు ఖతం చేస్తాడా?
Follow us on

చెన్నై: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ సీజన్ రానే వచ్చింది.  ఈ సందర్భంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య నేడు మొదటి మ్యాచ్ జరగనుంది. కాగా ప్రపంచక్రికెట్‌లో ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన వన్డే వరల్డ్ నెంబర్ వన్ బ్యాట్స్‌మన్  కోహ్లీ  ఐపీఎల్‌లో కూడా మూడు రికార్డులకు అతి చేరువలో ఉన్నాడు. ఈరోజు చెన్నైతో మ్యాచ్‌లో ఈ ఏస్ బ్యాట్స్‌మన్ ఆ రికార్డుల అంతు చూస్తాడో, లేదో చూడాలి.

5 వేల పరుగులు : ఇంకో 52 పరుగులు చేస్తే ఐపీఎల్‌లో 5 వేల పరుగులు పూర్తిచేసిన మొదటి ఆటగాడిగా కోహ్లీ రికార్డులకు ఎక్కబోతున్నాడు.

ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు: ప్రస్తుతం ఐపీఎల్‌లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్లేయర్ సురేశ్‌రైనా ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. 176 మ్యాచుల్లో 4985 పరుగులు చేసి అగ్రస్థానంలో కొనసాగుతుండగా రాయల్‌ ఛాలెంజర్స్ కెప్టెన్‌ కోహ్లీ 163 మ్యాచుల్లో 4948 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. మరో 38 పరుగులు చేస్తే రైనాను దాటి ముందుకు దూసుకుపోతాడు.

అత్యధిక అర్ధ శతకాలు: ఇక ఐపీఎల్‌లో అత్యధిక హాప్ సెంచరీలు చేసిన క్రికెటర్‌గా కోహ్లీ మరో రికార్డుకు అడుగు దూరంలో ఉన్నాడు. ఈ రోజు జరిగే మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేస్తే … ఇప్పటికే ఐపీఎల్‌లో 39 అర్ధశతకాలు బాదిన డేవిడ్‌ వార్నర్‌‌తో ఫస్ట్ ప్లేస్ షేర్ చేసుకోనున్నాడు కోహ్లి. మరి ఈ రోజు మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసి కోహ్లి అభిమానులను మెస్మరైజ్ చేస్తాడో, లేదో  చూడాలి.