T20 World Cup: జట్టులో చాలా మంది వికెట్ కీపర్లు ఉన్నారు.. ఎవరు ఆడుతారో చూద్దాం.. పంత్‎కు‎ కోహ్లీ హెచ్చరిక!..

టీ 20 వరల్డ్ కప్ ఈనెల 17 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌తో సరదా సరదాగా ముచ్చటించారు...

T20 World Cup: జట్టులో  చాలా మంది వికెట్ కీపర్లు ఉన్నారు.. ఎవరు ఆడుతారో చూద్దాం.. పంత్‎కు‎ కోహ్లీ హెచ్చరిక!..
Kohli

Updated on: Oct 15, 2021 | 3:27 PM

టీ 20 వరల్డ్ కప్ ఈనెల 17 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌తో సరదా సరదాగా ముచ్చటించారు. భారత జట్టులో చాలా మంది వికెట్ కీపర్‌లు ఉన్నారని, వార్మప్‌లలో ఎవరు బాగా ఆడుతున్నారో చూస్తామని కోహ్లీ పంత్‎కు గుర్తు చేశాడు. “రిషభ్.. టీ 20 క్రికెట్‌లో సిక్సర్లు కొడితే గెలుస్తాం” అని స్టార్ స్పోర్ట్స్ ఇండియా షేర్ చేసిన వీడియోలో కోహ్లీ వర్చువల్ కాల్‌లో పంత్‌కి చెప్పాడు.

“భయపడకు భయ్యా, నేను ప్రతిరోజూ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఒక వికెట్ కీపర్ ఒక సిక్సర్ కొట్టడం ద్వారా భారతదేశం ప్రపంచ కప్ గెలిచింది” అని పంత్ అన్నారు. వాంఖడే స్టేడియంలో 2011 ప్రపంచ కప్ ఫైనల్‌ను ధోనీ భాయ్ సిక్సర్‌తో ముగించాడు. భారతదేశం యొక్క రెండవ ప్రపంచ కప్ టైటిల్‌ను సాధించాం. “అవును, అయితే అప్పటి నుండి భారతదేశానికి మహి భాయ్ లాంటి వికెట్ కీపర్ లభించలేదు” అని కోహ్లీ చెప్పాడు. తాను భారత వికెట్ కీపర్ అని పంత్ చెప్పినప్పుడు, కోహ్లీ ఇలా అన్నాడు “నా దగ్గర చాలా మంది వికెట్ కీపర్‌లు ఉన్నారు, ఎవరు వార్మప్‌లో ఆడుతున్నారో చూద్దాం.” టోర్నమెంట్‌కు ముందు వార్మప్ మ్యాచ్‌లలో దుబాయ్‌లో అక్టోబర్ 18, 20 తేదీలలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతుంది. అక్టోబర్ 24 న దుబాయ్‌లో టీ 20 వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్‌లో వారు పాకిస్థాన్‌తో టీం ఇండియా తలపడనుంది.

Read Also.. Big News: టీమిండియాకు దూరం కానున్న విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ.. కారణం ఏంటంటే?

Loading...
Unable to load recommendations.
Follow Us