
దేశవాళీ క్రికెట్లో ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీలో మన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ప్రాపర్ టెస్ట్ క్రికెట్తో అదరగొడుతున్నాడు. బెంగళూరులో నార్త్ జోన్తో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్లో సౌత్ జోన్ కెప్టెన్గా తిలక్ వర్మ ప్రాణం పెట్టి బ్యాటింగ్ చేస్తున్నాడు. ఒకటి కాదు రెండు ఏకంగా 153 బంతులు ఆడి కూడా ఒక్కటంటే ఒక్క ఫోర్, సిక్స్ కూడా కొట్టలేదు. 149 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు కానీ, తన ఇన్నింగ్స్లో తొలి ఫోర్ కొట్టేందుకు 154 బంతులు తీసుకున్నాడు.
ఈ నంబర్లు చూస్తుంటే తిలక్ వర్మ చాలా జిడ్డుగా బ్యాటింగ్ చేస్తున్నాడని అనిపిస్తోంది కదూ. కానీ, అక్కడ పరిస్థితి వేరు. కేవలం 85 పరుగులకే సౌత్ జోన్ కీలక 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇలాంటి పరిస్థితుల్లో కెప్టెన్గా తిలక్ భారం మొత్తం తన భుజాలపై వేసుకున్నాడు. రిక్కీ భుయి 5, షేక్ రషీద్ 0, హిమతేజ 0 వంటి బ్యాటర్లు విఫలం అవ్వడంతో సౌత్ జోన్ కష్టాల్లో పడింది. ఇలాంటి సమయంలో కెప్టెన్ తిలక్ వర్మ శ్రేయస్ గోపాల్తో కలిసి ఇన్నింగ్స్ను నిలబెట్టాడు.
అందుకోసం తన అగ్రెసివ్ అప్రోచ్ను సైతం పక్కనపెట్టి చాలా సహనంతో బ్యాటింగ్ చేశాడు. ఎక్కడా కూడా బౌలర్లకు అవకాశం ఇవ్వకుండా కేవలం సింగిల్స్, డబుల్స్ తోనే ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. 149 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత 154వ బంతికి బౌండరీ బాదాడు. తిలక్ వర్మ సహనానికి ప్రత్యర్థి జట్టు బౌలర్లు కూడా ఫిదా అయిపోయారు. ఇన్నింగ్స్ చూస్తే జిడ్డూ బ్యాటింగ్లా ఉన్నా.. అసలైన టెస్ట్ క్రికెట్ మజా అందులోనే ఉంది. ప్రస్తుతం సౌత్ జోన్ 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. తిలక్, గోపాల్ క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు నార్త్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 195 పరుగులకు ఆలౌట్ అయింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి