India Super 8 Stage: టీమిండియాకు సూపర్ 8 గండం.. షాకిస్తోన్న ‘3’వ నంబర్.. అదే జరిగితే 4వసారి ఇంటికే

T20 World Cup 2024: ఈ టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2024)లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో సూపర్-8 రౌండ్‌లోకి ప్రవేశించింది. సూపర్-8లో భారత్ అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాతో తలపడనుంది. టోర్నీలో ఇప్పటి వరకు టీమ్‌ ఇండియా ఓటమి ఎరుగలేదు. ఈ స్థితిలో సూపర్-8 రౌండ్‌లో భారత జట్టు ఎలా రాణిస్తుందనే ప్రశ్న క్రికెట్ అభిమానులందరిలో మెదులుతోంది.

India Super 8 Stage: టీమిండియాకు సూపర్ 8 గండం.. షాకిస్తోన్న 3వ నంబర్.. అదే జరిగితే 4వసారి ఇంటికే
Team India

Updated on: Jun 19, 2024 | 2:52 PM

Team India’s Performance In Super 8 Stage: ఈ టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2024)లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో సూపర్-8 రౌండ్‌లోకి ప్రవేశించింది. సూపర్-8లో భారత్ అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాతో తలపడనుంది. టోర్నీలో ఇప్పటి వరకు టీమ్‌ ఇండియా ఓటమి ఎరుగలేదు. ఈ స్థితిలో సూపర్-8 రౌండ్‌లో భారత జట్టు ఎలా రాణిస్తుందనే ప్రశ్న క్రికెట్ అభిమానులందరిలో మెదులుతోంది. గత 8 ఎడిషన్లలో సూపర్-8 రౌండ్‌లో భారత జట్టు ఎలా రాణించింది? తెలుసుకోవడం చాలాముఖ్యం. అయితే సూపర్ 8 రౌండ్‌లో టీమ్ ఇండియాకు 3 సార్లు షాకులు తగిలాయి.

2009లో మొత్తం 3 మ్యాచ్‌ల్లో ఓటమి..

2007లో జరిగిన తొలి ఎడిషన్‌ టోర్నీలో పాకిస్థాన్‌ను ఓడించి టీమిండియా తొలి టైటిల్‌ను కైవసం చేసుకుంది. దీని తర్వాత 2009లో రెండో ఎడిషన్‌లో భారత్‌ సూపర్‌-8లోకి ప్రవేశించింది. ఈ రౌండ్‌లో భారత్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్ ఇలా మూడు జట్లతో తలపడింది. అయితే, ఈ మూడు జట్లపైన ఓటమి పాలైంది. దీంతో గ్రూప్‌లో చివరి స్థానంలో నిలిచి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

2010లో అదే కథ..

2010 ప్రపంచకప్‌లో గ్రూప్ సీలో భాగంగా భారత్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి సూపర్-8లోకి ప్రవేశించింది. ఆ తర్వాత సూపర్-8 రౌండ్‌లో ఆస్ట్రేలియా, శ్రీలంక, వెస్టిండీస్‌తో తలపడిన టీమిండియా.. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. దీంతో ఆ జట్టు గ్రూప్‌లో చివరి స్థానంలో నిలిచి ప్రయాణాన్ని ముగించింది.

2012లో నెట్ రన్ రేట్ దెబ్బ..

2009, 2010 ప్రపంచకప్‌ల మాదిరిగానే 2012 ప్రపంచకప్‌లోనూ భారత్‌ మరోసారి సూపర్‌-8 రౌండ్‌కు దూరమైంది. ఈ ప్రపంచకప్‌లో గ్రూప్‌ దశలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి భారత్ సూపర్-8లోకి ప్రవేశించింది. ఈ రౌండ్‌లో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, దక్షిణాఫ్రికాతో తలపడింది, 2 జట్లపై గెలిచి ఆస్ట్రేలియాపై ఓడిపోయింది. కానీ, నెట్ రన్ రేట్ పరంగా పాకిస్థాన్ కంటే వెనుకబడి ఉండటంతో భారత జట్టు ఈసారి కూడా సూపర్-8 రౌండ్ నుంచి నిష్క్రమించింది.

ఈసారి కూడా మూడు జట్లతోనే పోరు..

ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్‌ సూపర్‌-8 రౌండ్‌లో ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్‌, బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ మూడు జట్లపై భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. అయితే, ప్రస్తుతం ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్‌ల ఫామ్‌ను చూస్తుంటే భారత్‌ సెమీఫైనల్‌ ప్రయాణం అంత సులువు కాదని తెలుస్తోంది. కాబట్టి ఈ రౌండ్‌లో భారత్ జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us