AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: టార్గెట్ 107.. అప్పుడు ఆసీస్, ఇప్పుడు కివీస్.. 20 ఏళ్ల హిస్టరీ రోహిత్ సేన రిపీట్ చేసేనా?

India vs New Zealand 2024: ప్రస్తుతం అందరి చూపు బెంగళూరు వైపే ఉంది. భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్టు విజయం కోసం తీవ్రంగా పోరాడుతున్నాయి. అవకాశాలు ఎక్కువగా కివీస్‌ వైపే ఉన్నా.. టీమిండియా కూడా చివరిదాకా పోరాడుతోంది. ఈ క్రమంలో చిన్న టార్గెట్ అయినా 20 ఏళ్ల హిస్టరీని రిపీట్ చేయాలని అంతా కోరుకుంటున్నారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

IND vs NZ: టార్గెట్ 107.. అప్పుడు ఆసీస్, ఇప్పుడు కివీస్.. 20 ఏళ్ల హిస్టరీ రోహిత్ సేన రిపీట్ చేసేనా?
Ind Vs Nz Ind Vs Aus 2004
Venkata Chari
|

Updated on: Oct 20, 2024 | 10:43 AM

Share

India vs New Zealand 2024: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ బెంగళూరు వేదికగా జరుగుతుండగా, ఇందులో టీమిండియా ఓటమి ప్రమాదంలో పడింది. భారత జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో మంచి స్థితిలో ఉండి ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ 356 పరుగుల ఆధిక్యాన్ని దాటేసిన తర్వాత, ఒక దశలో భారత్ స్కోరు 408/3గా నిలిచింది. కనీసం 550 పరుగులైనా భారత జట్టు సులువుగా స్కోర్ చేసి, బహుశా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి, న్యూజిలాండ్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం ఇస్తుందేమో అనిపించింది. కానీ, కొత్త బంతికి ముందు భారత బ్యాట్స్‌మెన్స్ పరిస్థితి దిగజారడంతో టీమ్ ఇండియా రెండో ఇన్నింగ్స్ 462 పరుగులకే పరిమితమైంది. దీంతో న్యూజిలాండ్‌కు 107 పరుగుల టార్గెట్ లభించింది.

లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ నాలుగో రోజు నాలుగు బంతులు మాత్రమే ఆడగా, వెలుతురు కారణంగా ఆట నిలిచిపోయింది. ఆపై భారీ వర్షం కురిసింది. ఈ విధంగా, న్యూజిలాండ్ తన రెండవ ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగు కూడా చేయలేదు. 10 వికెట్లు మిగిలి ఉన్నాయి. ఐదో రోజు కివీస్ జట్టుకు 107 పరుగుల సవాలు ఎదురైంది. ఈ లక్ష్యాన్ని విన్న భారత అభిమానులు, 2004లో ముంబైలో ఆస్ట్రేలియాపై చేసిన ఫీట్‌ను టీమిండియా పునరావృతం చేసి మ్యాచ్‌ను విజయంతో ముగించాలని ఆశిస్తున్నారు.

ముంబై టెస్టులో భారత్ అద్భుత విజయం..

2004లో ఆస్ట్రేలియా భారత్‌లో పర్యటించినప్పుడు, టెస్టుల్లో అత్యల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసి టీమిండియా రికార్డు సృష్టించింది. ముంబైలో జరిగిన మ్యాచ్‌లో, భారత్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 104 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా ఆస్ట్రేలియా 203 పరుగులు చేసి 99 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా కేవలం 205 పరుగులకే ఆలౌటైంది. ఆస్ట్రేలియాకు 107 పరుగుల విజయ లక్ష్యం అందించింది. కంగారూ జట్టుకు ఇది సులువైన విజయం అని అనిపించినా ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్స్‌కు భారత బౌలర్ల ముందు తేలిపోయారు. దీంతో భారత్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో భారత్ తరపున హర్భజన్ సింగ్ అత్యధికంగా ఐదు వికెట్లు పడగొట్టాడు.

ఇప్పుడు భారత అభిమానులు కూడా జస్ప్రీత్ బుమ్రా ఆధ్వర్యంలో బౌలర్లందరూ విధ్వంసం సృష్టించి, న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌లను ఓడించి, టీమ్ ఇండియాకు భారీ విజయాన్ని అందించాలని ఆశిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..