IND vs NZ: టీమిండియా ఓటమిపై 3 ప్రశ్నలు సంధించిన క్రికెట్ గాడ్.. ఏమన్నాడంటే?

న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా క్లీన్‌స్వీప్‌ను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ఓటమిపై గ్రేట్ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ కూడా ప్రశ్నలు సంధించాడు. టీమిండియా పేలవ ప్రదర్శనపై ఆందోళన వ్యక్తం చేశాడు. అయితే, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ అద్భుతమైన బ్యాటింగ్‌పై ప్రశంసలు కురిపించాడు.

IND vs NZ: టీమిండియా ఓటమిపై 3 ప్రశ్నలు సంధించిన క్రికెట్ గాడ్.. ఏమన్నాడంటే?
Ind Vs Nz Test Series

Updated on: Nov 04, 2024 | 7:57 AM

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఓటమిని భారత్‌లో ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆటగాళ్ల ప్రదర్శనపై అభిమానులు, పలువురు భారత అనుభవజ్ఞులు ప్రశ్నలు సంధిస్తున్నారు. క్రికెట్ దేవుడుగా పేరుగాంచిన సచిన్ టెండూల్కర్ కూడా ఈ అవమానకరమైన ఓటమి తర్వాత తనను తాను ఆపుకోలేకపోయాడు. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేస్తూ టీమిండియా ఆటతీరుపై ఘాటుగా స్పందించాడు. ఈ సిరీస్‌లో ఓడిపోవడంపై సచిన్ 3 పెద్ద ప్రశ్నలను అడిగాడు. అయితే, ఈ మ్యాచ్‌లో జట్టును నిలబెట్టడానికి తమ శాయశక్తులా ప్రయత్నించిన శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్‌లను కూడా అతను ప్రశంసించాడు.

ఓటమిపై ఆందోళన వ్యక్తం చేసిన సచిన్ టెండూల్కర్..

టీమిండియా అవమానకరమైన ఓటమి గురించి మాట్లాడితే, సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. ‘హోమ్ గ్రౌండ్‌లో 3-0తో ఓడిపోవడం చాలా కష్టం. ఆత్మపరిశీలన అవసరం అంటూ రాసుకొచ్చాడు. అలాగే, ‘ఇది ప్రిపరేషన్ లోపమా, పేలవమైన షాట్ ఎంపికనా, లేదా మ్యాచ్ ప్రాక్టీస్ లోపమా?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

శుభమాన్ గిల్, పంత్ ప్రదర్శనపై ప్రశంసలు..

ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ 90 పరుగులు చేయగా, పంత్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు సాధించాడు. ఈ ఆటగాళ్లను ప్రశంసిస్తూ, సచిన్ ‘శుభ్మన్ గిల్ మొదటి ఇన్నింగ్స్‌లో ఫ్లెక్సిబిలిటీని కనబరిచాడు. రిషబ్ పంత్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అద్భుతంగా ఆడాడు. అతని ఫుట్‌వర్క్ మైదానాన్ని పూర్తిగా భిన్నంగా చేసింది. అతను నిజంగా అద్భుతంగా ఉన్నాడు’ అంటూ చెప్పుకొచ్చాడు.

న్యూజిలాండ్ జట్టుకు అభినందనలు..

సచిన్ టెండూల్కర్ తన పోస్ట్‌లో న్యూజిలాండ్ జట్టుపై ప్రశంసలు కురిపించాడు. ‘సిరీస్ అంతటా స్థిరమైన మంచి ప్రదర్శన కోసం పూర్తి క్రెడిట్ న్యూజిలాండ్‌కు చెందుతుంది. భారత్‌లో 3-0తో గెలవడం అత్యుత్తమ ఫలితం. న్యూజిలాండ్ తన క్రికెట్ చరిత్రలో తొలిసారిగా భారత్‌లో టెస్ట్ సిరీస్‌ను గెలుచుకుంది. అదే సమయంలో, ఒక జట్టు తన సొంత మైదానంలో 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్‌ను క్లీన్ స్వీప్ చేయడం ఇదే తొలిసారి. ఇంతకు ముందు ఏ జట్టు కూడా ఈ ఘనత సాధించలేకపోయింది. ఈ సిరీస్‌లో, న్యూజిలాండ్ చాలా సంవత్సరాల తర్వాత భారత్‌లో టెస్ట్ మ్యాచ్ గెలిచిన ఘనత కూడా సాధించింది’ అంటూ చెప్పుకొచ్చింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us