AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hardik Pandya: హార్దిక్ పాండ్యా ఆటిట్యూట్‌తో ఓడిన భారత్.. అర్ష్‌దీప్‌తో ఓవర్ యాక్షన్.. ఏమన్నాడంటే?

IND vs SA: పోర్ట్ ఎలిజబెత్ వేదికగా జరిగిన రెండో టీ20లో దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా 3 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు కేవలం 124 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇందులో హార్దిక్ పాండ్యా అత్యధికంగా 39 పరుగులు చేశాడు. అయితే, హార్దిక్ అతని ఆట తీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Hardik Pandya: హార్దిక్ పాండ్యా ఆటిట్యూట్‌తో ఓడిన భారత్.. అర్ష్‌దీప్‌తో ఓవర్ యాక్షన్.. ఏమన్నాడంటే?
Ind Vs Sa 2nd T20i Hardik P
Venkata Chari
|

Updated on: Nov 11, 2024 | 10:11 AM

Share

IND vs SA 2nd T20I: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. డర్బన్ లో తుఫాన్ బ్యాటింగ్‌తో భారీ స్కోరు సాధించిన టీమిండియా.. పోర్ట్ ఎలిజబెత్‌లో కేవలం 124 పరుగులకే కుప్పకూలింది. ఇక్కడకు చేరుకోవడానికి దక్షిణాఫ్రికా కూడా కష్టపడాల్సి వచ్చింది. కానీ, 19 ఓవర్లలో లక్ష్యాన్ని సాధించింది. ఈ ఓటమికి టీమిండియా టాప్ ఆర్డర్ వైఫల్యం ప్రధాన కారణమైనప్పటికీ, హార్దిక్ పాండ్యా అతి కూడా జట్టును నష్టపరిచాయి. అతను గరిష్టంగా పరుగులు చేసినప్పటికీ, చివరి ఓవర్లలో కూడా తప్పులు చేశాడు. దీని కారణంగా జట్టు భారీగా పరుగులు చేయలేకపోయింది.

తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు సంజూ శాంసన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్ వంటి తుఫాన్ బ్యాట్స్‌మెన్‌ల వికెట్లను త్వరగా కోల్పోయింది. 45 పరుగులకే 4 వికెట్లు పడగా, ఆ తర్వాత హార్దిక్ పాండ్యా క్రీజులోకి వచ్చాడు. ఇంతలో, అక్షర్ పటేల్ కొన్ని షాట్లు కొట్టడం ద్వారా త్వరగా పరుగులు సాధించాడు. అయితే, హార్దిక్ పాండ్యా పోరాడుతూ కనిపించాడు. ఆ తర్వాత అక్షర్ రనౌట్ కావడంతోపాటు రింకూ సింగ్ వికెట్ కూడా పడటంతో తన ఇన్నింగ్స్ 28వ బంతికి తొలి బౌండరీ బాదిన హార్దిక్‌పై పూర్తి బాధ్యత పడింది.

అర్ష్‌దీప్‌తో హార్దిక్ ఏం చెప్పాడు?

హార్దిక్‌తో కలిసి క్రీజులో నిలవడానికి ఎక్కువ మంది బ్యాట్స్‌మెన్స్ లేకపోవడంతో 16వ ఓవర్ నుంచి అర్ష్‌దీప్ సింగ్ అతనితో కలిసి క్రీజులోకి వచ్చాడు. ఇటువంటి పరిస్థితిలో పరుగులు సాధించే బాధ్యత మొత్తం అతనిపై ఉంది. హార్దిక్ కూడా కొన్ని షాట్‌లు కొట్టాడు. కానీ, అప్పటికీ అది అవసరానికి అనుగుణంగా ఉపయోగపడలేదు. ఆ తర్వాత 19వ ఓవర్‌లో ఏదో జరిగింది. అది హార్దిక్‌పై విమర్శలకు కారణం అయింది. ఈ ఓవర్ రెండో బంతికి అర్ష్‌దీప్ 1 పరుగు తీసుకోగా, హార్దిక్ స్ట్రైక్‌లోకి వచ్చాడు. ఇక్కడే హార్దిక్ అర్ష్‌దీప్‌తో మాట్లాడుతూ మరో ఎండ్‌లో నిలబడి షోని ఆస్వాదించమని చెప్పాడు.

ఈ విషయం స్టంప్ మైక్‌లో రికార్డ్ అయింది. ప్రతి ఒక్కరూ టీవీలో విన్నారు. హార్దిక్ ప్రకటన అర్థం ఏమిటంటే, అర్ష్‌దీప్ అతను బౌండరీలు కొడుతుంటే చూస్తూ ఉండాలని అర్షదీప్‌ను కోరాడు. అయితే, మైదానంలో అందుకు విరుద్ధంగా జరిగింది. హార్దిక్ తర్వాతి 3 బంతుల్లో ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. చివరి బంతికి 1 పరుగు లెగ్ బై తీసుకొని స్ట్రైక్‌ని తన వద్ద ఉంచుకున్నాడు. ఆపై 20వ ఓవర్‌లో అదే జరిగింది. హార్దిక్ మొదటి 4 బంతుల్లో ఎటువంటి బౌండరీని కొట్టలేకపోయాడు. అయితే 3 సార్లు సింగిల్స్ పరుగులకు నిరాకరించాడు.

టీమ్ ఇండియా ఓటమిలో హార్దిక్ కీలక పాత్ర..

ఆఖర్లో హార్దిక్ 5వ బంతికి 2 పరుగులు, చివరి బంతికి ఫోర్ కొట్టాడు. కానీ ఆ పరుగులు సరిపోలేదు. అర్ష్‌దీప్ చాలా అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మన్ కాదు. కానీ, క్రీజులో ఉన్నప్పుడు ప్రతి పరుగు ముఖ్యమైనది. అయితే, అర్ష్‌దీప్ 6 బంతుల్లో 7 పరుగులు చేశాడు. ఇందులో ఒక సిక్సర్ కూడా ఉంది. హార్దిక్ స్ట్రైక్ రొటేట్ చేసి ఉంటే బహుశా స్కోరుకు మరికొన్ని పరుగులు చేరితే, టీమ్ ఇండియా ఓటమిని తప్పించుకునేది. హార్దిక్ 45 బంతుల్లో 39 పరుగులు మాత్రమే చేయడంతో ఓటమిపాలైంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..