
Mohsin Naqvi Angry on Pakistan Players: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ భారత్ పై పాకిస్తాన్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాడు. ఆయన ఇప్పుడు తన కోపాన్ని మొత్తం జట్టుపై చూపించాడు. పాకిస్తాన్ జట్టు ఓడిపోయిన వెంటనే, పీసీబీ చీఫ్ నఖ్వీ వెంటనే స్టేడియం నుంచి వెళ్లిపోయాడు. ఓటమి తర్వాత ఆయన జట్టుపై అసంతృప్తిగా ఉన్నట్లు కనిపించాడు. ఈ ఓటమి పాకిస్తాన్కు చాలా బాధాకరం. ఎందుకంట, ఇది 2026 టీ20 ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు బహిష్కరణ డ్రామా ఆడిన అదే దేశం.. ఎన్నో మలుపు తర్వాత తిరిగి ఆటలోకి వచ్చింది.
మొహ్సిన్ నఖ్వీ పాకిస్తాన్ ప్రభుత్వంలో మంత్రి కూడా. పాకిస్తాన్ 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తున్న సమయంలో, అతను 12వ ఓవర్ వరకు మ్యాచ్ను చూశాడు. అయితే, పాకిస్తాన్ ఓడిపోవడం ప్రారంభించగానే, నఖ్వీ స్టేడియం వదిలి వెళ్లిపోయాడు.
ఓటమి తర్వాత మొహ్సిన్ నఖ్వీ జట్టు మేనేజర్తో మాట్లాడాడు. ఈ ఓటమి భరించలేనిదని కూడా ఆయన అన్నాడని తెలుస్తోంది. ఈ ఓటమి తర్వాత జట్టు, ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలని ఆయన జట్టు మేనేజర్కు స్పష్టంగా ఆదేశించినట్లు తెలుస్తోంది.
భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే, అభిషేక్ శర్మ పరుగులు చేయకుండానే ఔటయ్యాడు. కానీ ఆ తర్వాత ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 77 పరుగులు చేశాడు. తిలక్ వర్మతో 87 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు. దీంతో భారత జట్టు 175 పరుగులు సాధించడంలో వీరంతా కీలక పాత్ర పోషించారు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ 114 పరుగులకే ఆలౌట్ అయింది.
పాకిస్తాన్ ఓటమి తర్వాత బాబర్ అజామ్, షాహీన్ అఫ్రిదిలపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని గమనించాలి. ఇద్దరినీ జట్టు నుంచి విడుదల చేయవచ్చు. అంతేకాకుండా, వారిని zw20 ప్రపంచ కప్ 2026 మ్యాచ్ల నుంచి కూడా మినహాయించవచ్చని చెబుతున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..