మొహాలీ: ఐపీఎల్లో భాగంగా మొహాలీ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తలబడనుంది. ఈ మ్యాచ్ లో భాగంగా పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇకపోతే ఇరు జట్లు క్రిందటి మ్యాచులు ఓడిపోవడంతో ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్నారు. కాగా ఈ మ్యాచ్లో సన్రైజర్స్ గత మ్యాచ్లోని జట్టునే కొనసాగిస్తుండగా.. పంజాబ్ జట్టు రెండు మార్పులు చేసింది. మురగన్ అశ్విన్, అండ్రూ టైల స్థానంలో అంకిత్ రాజ్పుత్, ముజీబ్ రెహ్మాన్లను జట్టులోకి తీసుకున్నారు.