
Shubman Gill Fined 12 Lakhs by BCCI: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మాన్ గిల్కు ఐపీఎల్ 2025 సీజన్ అద్భుతంగా సాగుతోంది. ఏప్రిల్ 19న అక్షర్ పటేల్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ను 7 వికెట్ల తేడాతో ఓడించి సీజన్లో ఐదవ విజయాన్ని నమోదు చేశాడు. దీంతో అతని జట్టు పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది. కానీ, ఈ ఆనందం తర్వాత, గిల్ కు ఒక చెడ్డ వార్త కూడా వచ్చింది. నిజానికి, అతను స్లో ఓవర్ రేట్కు దోషిగా తేలాడు. మ్యాచ్ తర్వాత బీసీసీఐ అతనికి శిక్ష విధించింది. అతనికి రూ. 12 లక్షల జరిమానా విధించింది.

2025 ఐపీఎల్లో స్లో ఓవర్ రేట్ కారణంగా బీసీసీఐ జరిమానా విధించిన ఆరో కెప్టెన్గా శుభ్మాన్ గిల్. "అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఐపీఎల్ 2025 మ్యాచ్ నంబర్ 35లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మాన్ గిల్ స్లో ఓవర్ రేట్ను కొనసాగించాడు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం ఈ సీజన్లో అతని జట్టు చేసిన మొదటి నేరం ఇది. అందువల్ల, గిల్కు రూ. 12 లక్షల జరిమానా విధించాం" అని ఐపీఎల్ ఒక ప్రకటన విడుదల చేసింది.

శుభ్మాన్ గిల్ కంటే ముందు, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ కూడా స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానాకు గురయ్యాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, లక్నో సూపర్ జెయింట్స్ రిషబ్ పంత్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్లు సంజు శాంసన్, రియాన్ పరాగ్ లకు కూడా స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా విధించారు.

గుజరాత్ వర్సెస్ ఢిల్లీ జట్టు మధ్య ఈ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మధ్యాహ్నం 3:30 గంటలకు జరిగింది. మ్యాచ్ సమయంలో తీవ్రమైన వేడి నెలకొంది. ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ దాటింది. ఈ మండే వేడిలో, గుజరాత్ బౌలర్లు ముందుగా బౌలింగ్ వేశారు. దీని కారణంగా గుజరాత్ బౌలర్లు వేడి, ఉక్కపోత, ఒత్తిడి వంటి సమస్యలను ఎదుర్కొన్నారు. అందువల్ల, మ్యాచ్ను పదే పదే నిలిపివేయాల్సి వచ్చింది. దీనికి శుభ్మాన్ గిల్ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

ఇషాంత్ శర్మ తన మొదటి ఓవర్ వేసిన తర్వాత మైదానం నుంచి వెళ్ళిపోయాడు. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ కూడా తిమ్మిరితో బాధపడ్డారు. జోస్ బట్లర్ కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నాడు. మండుతున్న ఎండలో నిలబడటానికి అంపైర్లు కూడా చాలా ఇబ్బంది పడ్డారు.