Sachin Tendulkar Coments: ఆస్ట్రేలియా సిరీస్లో తరచూ వినిపించే మాట జాత్యహంకార వ్యాఖ్యలు. ప్రతిసారి ఆస్ట్రేలియా టూర్లో ఇండియన్ క్రికెటర్లు ఎదుర్కొనే సమస్యే. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ జాత్యహంకార వ్యాఖ్యలకు గురైన సంగతి తెలిసిందే. దీనిపై టీం ఇండియా మాజీ క్రికెటర్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు.
ఈ విషయం పై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ స్పందిస్తూ.. క్రికెట్ అనేది ఎప్పుడూ వివక్ష చూపదని, ఇది కేవలం బ్యాట్, బంతి పట్టుకున్న ఆటగాళ్ల ప్రతిభ మాత్రమే చూస్తుందని అన్నారు. ఇందులో ఆటగాళ్ల జాతి, రంగు, మతంతో సంబంధం లేదని, ఈ విషయం అర్థం చేసుకోని వారికి క్రీడా రంగంలో కొనసాగే అర్హత లేదని అసహనం వ్యక్తం చేశాడు. అంతకుముందు సెహ్వాగ్ కూడా ఇలాగే స్పందించాడు. సిడ్నీ టెస్టులో పలువురు ఆస్ట్రేలియా ప్రేక్షకులు చేసింది దురదృష్టకరం’ అని ట్వీట్ చేశాడు. హర్భజన్ సింగ్ స్పందిస్తూ తాను కూడా ఆస్ట్రేలియాలో ఆడేటప్పుడు చాలాసార్లు జాతి వివక్ష వ్యాఖ్యలు ఎదుర్కొన్నట్లు చెప్పాడు. ఆస్ట్రేలియా ప్రేక్షకులు ఇలా చేయడం ఇదే తొలిసారి కాదని, వాటిని ఎలా అరికడతారని ప్రశ్నించాడు.
India Vs Australia 2020: జాత్యహంకార దూషణలపై తీవ్రంగా స్పందించిన టీమిండియా సారథి విరాట్ కోహ్లీ..