T20 World Cup 2021: మరో ఘనత సాధించిన రోహిత్ శర్మ.. 3000 పరుగులు చేసిన మూడో బ్యాట్స్‎మెన్‎గా రికార్డు..

టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ సోమవారం మరో ఘనత సాధించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో 3000 పరుగులు చేసిన మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు...

T20 World Cup 2021: మరో ఘనత సాధించిన రోహిత్ శర్మ.. 3000 పరుగులు చేసిన మూడో బ్యాట్స్‎మెన్‎గా రికార్డు..
అదే సమయంలో, 2019 నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ను గెలుచుకున్న వారిలో రోహిత్ కూడా ముందంజలో ఉన్నాడు. ఈ కాలంలో రోహిత్ 12 సార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. అతని తర్వాతి స్థానంలో బంగ్లాదేశ్‌కు చెందిన షకీబ్ అల్ హసన్ ఉన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు హసన్ 10 సార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.

Updated on: Nov 08, 2021 | 10:04 PM

టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ సోమవారం మరో ఘనత సాధించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో 3000 పరుగులు చేసిన మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. 18 పరుగుల దూరంలో ఉన్న రోహిత్ నమీబియా రూబెన్ ట్రంపెల్‌మన్ బౌలింగ్‌లో బౌండరీతో ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 3227 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. మార్టిన్ గప్టిల్ 2వ స్థానంలో నిలిచాడు.

విరాట్ కోహ్లీ 91 మ్యాచ్‎ల్లో 3,216 పరుగులు చేశాడు. మార్టిన్ గుప్టిల్ 107 మ్యాచ్‎ల్లో 3.115 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 116 మ్యాచ్‎ల్లో 3000 పరుగులు మైలురాయిని సాధించాడు. రోహిత్ ఈ మ్యాచ్‎లో 37 బంతుల్లో 56(7 ఫోర్లు, 2 సిక్స్‎లు)పరుగులు చేశాడు. టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో అతని స్థానంలో రోహిత్ శర్మ ఎంపిక చేసే అవకాశలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

?

Read Also.. T20 World Cup 2021: పాకిస్తాన్‎కు దిమ్మదిరిగే సమాధానం ఇచ్చిన వసీం జాఫర్.. 12-1లో అర్థం ఏమిటంటే..

T20 World Cup 2021: సెమీస్‎కు ముందు ఇంగ్లాండ్‎కు షాక్.. గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్న ఓపెనర్..