AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK:’అతన్ని త్వరగా ఔట్ చేయండి.. లేదంటే, ఓటమితో మైదానం వీడాల్సిందే’

IND vs PAK: కొత్త బంతితో రోహిత్ శర్మను ఓపెనింగ్‌లో ఔట్ చేయకపోతే పాకిస్థాన్‌కు ఓటమి ఖాయమని వాహబ్, బాబర్ ఆజం జట్టును హెచ్చరించారు. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై రోహిత్ ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోగా, వన్డే ఫార్మాట్‌లో పాకిస్థాన్‌పై భారత కెప్టెన్ ఎప్పుడూ పరుగులు చేస్తాడని వహాబ్ చెప్పాడు.

IND vs PAK:'అతన్ని త్వరగా ఔట్ చేయండి.. లేదంటే, ఓటమితో మైదానం వీడాల్సిందే'
Ind Vs Pak Rohit Sharma
Venkata Chari
|

Updated on: Sep 01, 2023 | 9:44 PM

Share

India Vs Pakistan: సెప్టెంబర్ 2న క్యాండీలో భారత్ వర్సెస్ పాకిస్థాన్ (India Vs Pakistan) పోటీపడతాయి. ఆసియా కప్ (Asia Cup 2023) టోర్నమెంట్‌లో భారత జట్టుకు ఇది తొలి మ్యాచ్ కాగా, నేపాల్‌ను ఓడించిన పాకిస్థాన్ రెండో మ్యాచ్‌లో రోహిత్ శర్మ సేనతో తలపడేందుకు సిద్ధమైంది. ఇప్పటికే విజయవంతమైన ఆరంభంలో ఉన్న పాకిస్థాన్ తమ విజయాల పరంపరను కొనసాగించాలని చూస్తుండగా, రోహిత్ సేన విజయంతో టోర్నీని ప్రారంభించాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటే.. టాప్ ఆర్డర్ ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు రాణించాల్సిన అవసరం ఉంది. దీనిపై పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వహాబ్ రియాజ్ కూడా తన జట్టును హెచ్చరించాడు. రోహిత్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించిన రియాజ్.. రోహిత్‌ను త్వరగా ఔట్ చేయకుంటే.. పాకిస్థాన్‌ గేమ్ నుంచి తప్పుకున్నట్లేనని హెచ్చరించాడు.

క్యాండీలోని పల్లెకెలె వేదికగా జరగనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ గత కొన్ని మ్యాచ్‌ల మాదిరిగానే మరోసారి పాకిస్థాన్ ఫాస్ట్ బౌలింగ్, భారత టాప్ ఆర్డర్ మధ్య పోటీపై దృష్టి సారిస్తుంది. లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా ఆఫ్రిది, టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య పోటీని చూసేందుకు అభిమానులు ప్రత్యేకంగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే టీమ్ ఇండియాకు రోహిత్ శర్మ ఓపెనర్‌గా, పాకిస్థాన్‌కు షాహీన్ అఫ్రిది తొలి ఓవర్ వేయనున్నాడు. ముఖ్యంగా షాహీన్ తొలి ఓవర్‌లోనే వికెట్లు తీయడంలో పేరుగాంచాడు.

తొలి ఓవర్లతో జాగ్రత్త..

ఇదిలావుండగా, ఈసారి పరిస్థితి అంత సులభం కాదని పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వహాబ్ రియాజ్ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ గురించి రియాజ్ మాట్లాడుతూ, ఇది వన్డే మ్యాచ్ కాబట్టి, రోహిత్, షాహీన్ షా అఫ్రిది అతనితో మొదట్లో జాగ్రత్తగా ఆడవచ్చు. టీ20లా కాకుండా వన్డేల్లో తొలి ఓవర్ నుంచి వేగంగా పరుగులు చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి భారత ఓపెనర్లు జాగ్రత్తగా ఆడటంపై దృష్టి సారిస్తారు. ఇది వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.

పాకిస్థాన్‌ను ఒంటరిగా ఓడించే సత్తా రోహిత్‌కే ఉంది..

అంతేకాదు రోహిత్ శర్మ రూపంలో పాక్ జట్టుకు భారీ వార్నింగ్ ఇచ్చాడు వహాబ్. కొత్త బంతితో రోహిత్ శర్మను ఓపెనింగ్‌లో ఔట్ చేయకపోతే పాకిస్థాన్‌కు ఓటమి తప్పదని వహాబ్, బాబర్ ఆజం జట్టును హెచ్చరించారు. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై రోహిత్ ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోగా, వన్డే ఫార్మాట్‌లో పాకిస్థాన్‌పై భారత కెప్టెన్ ఎప్పుడూ పరుగులు చేస్తాడని వహాబ్ చెప్పాడు.

దీనికి తోడు పాక్‌పై వరుసగా రెండు వన్డేల్లోనూ రోహిత్ సెంచరీలు సాధించాడు. ఇందులో 2018 ఆసియా కప్‌లో 111 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన హిట్‌మ్యాన్.. ఏడాది తర్వాత 2019 ప్రపంచకప్‌లో 140 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా విజయం సాధించింది. మొత్తంగా, పాకిస్థాన్‌తో జరిగిన 16 వన్డేల్లో రోహిత్ 51 సగటుతో 720 పరుగులు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..