
Asia Cup 2025: క్రికెట్ ప్రపంచంలో ఆసియా కప్ ఒక ప్రతిష్టాత్మక టోర్నమెంట్. ఆసియాలోని అగ్రశ్రేణి జట్లు ఈ టోర్నమెంట్లో తమ సత్తా చాటడానికి పోటీ పడుతుంటాయి. అయితే, రాబోయే ఆసియా కప్ 2025 గురించి ఇటీవల కొన్ని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా పాకిస్థాన్ ఈ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించే అవకాశం ఉందని, టోర్నమెంట్ ప్రోమోలో కేవలం మూడు దేశాల కెప్టెన్లు మాత్రమే ఉండటం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.
పాకిస్థాన్ నిష్క్రమణకు కారణాలు..
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, పాకిస్థాన్ ఆసియా కప్ నుంచి నిష్క్రమించడానికి కొన్ని ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఆసియా కప్ ప్రోమోలో ముగ్గురు కెప్టెన్లు..
🚨 ASIA CUP ON SONY SPORTS 🚨 pic.twitter.com/wley67Vzp8
— Johns. (@CricCrazyJohns) June 24, 2025
ఆసియా కప్ 2025 కోసం విడుదలైన ప్రోమోలో కేవలం మూడు దేశాల కెప్టెన్లు మాత్రమే కనిపించడం ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది. సాధారణంగా, ఆసియాలోని ప్రధాన క్రికెట్ ఆడే దేశాలైన భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్లు ప్రోమోలో కనిపిస్తుంటారు. అయితే, ఈసారి ప్రోమోలో కేవలం భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ కెప్టెన్లు మాత్రమే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పాకిస్థాన్ కెప్టెన్ కనిపించకపోవడం ఆ జట్టు టోర్నీ నుంచి వైదొలుగుతుందనే అనుమానాలను బలపరుస్తోంది.
ప్రస్తుతానికి పాకిస్థాన్ ఆసియా కప్ నుంచి అధికారికంగా నిష్క్రమించినట్లు ఎటువంటి ప్రకటన లేదు. అయితే, భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న రాజకీయ, దౌత్య ఉద్రిక్తతలు, BCCI వైఖరి, ఆర్థికపరమైన అంశాలు పాకిస్థాన్ భాగస్వామ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్, సంబంధిత బోర్డుల నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. ఈ పరిణామాలు ఆసియా కప్ భవిష్యత్తుపై, ముఖ్యంగా క్రికెట్ అభిమానుల ఆశలపై తీవ్ర ప్రభావం చూపుతాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..