Ranji Trophy 2024: కేకేఆర్ వద్దని గెంటేసింది.. కట్‌చేస్తే.. వరుసగా రెండో డబుల్ సెంచరీతో స్ట్రాంగ్ కౌంటర్

Narayan Jagadeesan 2nd Successive Double Hundred: నారాయణ్ జగదీశన్ వరుసగా రెండో డబుల్ సెంచరీని సాధించడానికి ముందు , చండీగఢ్ తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. కానీ, తొలి ఇన్నింగ్స్‌లో చండీగఢ్ జట్టు 111 పరుగులకు ఆలౌటైంది. కునాల్ మహాజన్ (28) మినహా చండీగఢ్‌లో ఏ బ్యాట్స్‌మెన్ కూడా క్రీజులో నిలవలేకపోయారు.

Ranji Trophy 2024: కేకేఆర్ వద్దని గెంటేసింది.. కట్‌చేస్తే.. వరుసగా రెండో డబుల్ సెంచరీతో స్ట్రాంగ్ కౌంటర్
Narayan Jagadeesan

Updated on: Jan 27, 2024 | 3:23 PM

Narayan Jagadeesan 2nd Successive Double Hundred: రంజీ ట్రోఫీలో తమిళనాడు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ నారాయణ్ జగదీశన్ మరోసారి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కోయంబత్తూరులో చండీగఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించాడు. ఇది అతనికి వరుసగా రెండో డబుల్ సెంచరీ. గతంలో రైల్వేస్‌తో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో జగదీశన్ 245 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడాడు. నారాయణ్ రెండో డబుల్ సెంచరీ పూర్తి చేసిన సమయంలో 17 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. ఈ సీజన్‌లో అతనికిది రెండో డబుల్ సెంచరీ.

దీంతో నారాయణ్ ఓ ప్రత్యేక క్లబ్‌లోకి అడుగుపెట్టారు. రంజీ ట్రోఫీ సీజన్‌లో కనీసం రెండు డబుల్ సెంచరీలు చేసిన తమిళనాడు నుంచి మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అతనికి ముందు, WV రామన్ 1988-89 సీజన్‌లో 3 డబుల్ సెంచరీలు చేశాడు. అదే సమయంలో, 1991-92లో, రామన్ 2 డబుల్ సెంచరీలు చేశాడు. నారాయణ్ కంటే ముందు, అభినవ్ ముకుంద్ 2011-12 సీజన్‌లో రెండు డబుల్ సెంచరీలు సాధించిన ఘనతను కూడా సాధించాడు.

నారాయణ్ జగదీశన్ వరుసగా రెండో డబుల్ సెంచరీని సాధించడానికి ముందు , చండీగఢ్ తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. కానీ, తొలి ఇన్నింగ్స్‌లో చండీగఢ్ జట్టు 111 పరుగులకు ఆలౌటైంది. కునాల్ మహాజన్ (28) మినహా చండీగఢ్‌లో ఏ బ్యాట్స్‌మెన్ కూడా క్రీజులో నిలవలేకపోయారు. తమిళనాడు తరపున సందీప్ వారియర్, ఆర్ సాయి కిషోర్ చెరో 3 వికెట్లు తీశారు.

300 పరుగులు దాటిన తమిళనాడు ఆధిక్యం..

చండీగఢ్ 111 పరుగులకు సమాధానంగా తమిళనాడు వార్త రాసే సమయానికి 2 వికెట్లకు 410 పరుగులు చేసింది. నారాయణ్ జగదీషన్ 284 బంతుల్లో 217 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు 17 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టాడు. అతనితో పాటు ప్రదోష్ రంజన్ పాల్ కూడా సెంచరీ సాధించాడు. తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగులకు పైగా ఆధిక్యం సాధించింది.

IPLలో సేల్ కాలే..

IPL 2024 వేలానికి ముందు నారాయణ్ జగదీషన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ విడుదల చేసింది. ఆ తర్వాత వేలం జాబితాలో చోటు దక్కించుకోలేదు. ఈ కారణంగా అతను వేలంలో పాల్గొనలేకపోయాడు. ఈసారి ఐపీఎల్‌లో ఆడటం లేదు. గత ఐపీఎల్‌లో నారాయణ్ విఫలమయ్యాడు. అతను KKR కోసం 6 మ్యాచ్‌ల్లో 89 పరుగులు మాత్రమే చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..