AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: ఉప్పల్‌లో 90 బూచీ.. వణికిపోతోన్న టీమిండియా బ్యాటర్లు.. ఎందుకో తెలుసా?

India vs England: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా అర్ధసెంచరీల సాయంతో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 436 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అయితే, హైదరాబాద్ ఉప్పల్ మైదానంలో బ్యాటర్లు 90 పరుగులకు చేరుకోకుండానే వికెట్ కోల్పోతున్నారు. ముఖ్యంగా ముగ్గురు భారత ప్లేయర్లు ఇలా పెవిలయన్ చేరారు.

Venkata Chari
|

Updated on: Jan 27, 2024 | 1:35 PM

Share
హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 246 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా తరపున మూడు అర్ధ సెంచరీలు నమోదయ్యాయి.

హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 246 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా తరపున మూడు అర్ధ సెంచరీలు నమోదయ్యాయి.

1 / 6
అయితే, ఈ ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లు కూడా 90వ దశకంలో ఔట్ అయ్యి నిరాశపరిచారు. అంటే సెంచరీ పూర్తి చేసేందుకు మంచి అవకాశం ఉన్నప్పటికీ ఆ అవకాశాలను టీమిండియా బ్యాటర్లు వృధా చేసుకున్నారు.

అయితే, ఈ ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లు కూడా 90వ దశకంలో ఔట్ అయ్యి నిరాశపరిచారు. అంటే సెంచరీ పూర్తి చేసేందుకు మంచి అవకాశం ఉన్నప్పటికీ ఆ అవకాశాలను టీమిండియా బ్యాటర్లు వృధా చేసుకున్నారు.

2 / 6
ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా రంగంలోకి దిగిన యశస్వి జైస్వాల్ ఆరంభం నుంచే భీకర బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. బేస్ బాల్ కు ప్రత్యామ్నాయంగా దూకుడుగా ఆడిన జైస్వాల్ కేవలం 74 బంతుల్లో 3 సిక్సర్లతో 80 పరుగులు చేశాడు. కానీ 2వ రోజు ఆట ప్రారంభంలో జో రూట్‌కి సులువుగా క్యాచ్ ఇచ్చి సెంచరీ చేసే అవకాశాన్ని జైస్వాల్ కోల్పోయాడు.

ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా రంగంలోకి దిగిన యశస్వి జైస్వాల్ ఆరంభం నుంచే భీకర బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. బేస్ బాల్ కు ప్రత్యామ్నాయంగా దూకుడుగా ఆడిన జైస్వాల్ కేవలం 74 బంతుల్లో 3 సిక్సర్లతో 80 పరుగులు చేశాడు. కానీ 2వ రోజు ఆట ప్రారంభంలో జో రూట్‌కి సులువుగా క్యాచ్ ఇచ్చి సెంచరీ చేసే అవకాశాన్ని జైస్వాల్ కోల్పోయాడు.

3 / 6
ఆ తర్వాత, నాలుగో నంబర్‌లో బాధ్యతాయుతమైన బ్యాటింగ్‌ను కనబరిచిన కేఎల్ రాహుల్ నుంచి కూడా సెంచరీ ఆశించారు. రాహుల్ 86 పరుగులు చేసి జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తూ వికెట్‌ను సమర్పించుకున్నాడు. దీంతో 14 పరుగుల తేడాతో సెంచరీ కోల్పోయాడు.

ఆ తర్వాత, నాలుగో నంబర్‌లో బాధ్యతాయుతమైన బ్యాటింగ్‌ను కనబరిచిన కేఎల్ రాహుల్ నుంచి కూడా సెంచరీ ఆశించారు. రాహుల్ 86 పరుగులు చేసి జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తూ వికెట్‌ను సమర్పించుకున్నాడు. దీంతో 14 పరుగుల తేడాతో సెంచరీ కోల్పోయాడు.

4 / 6
ఆరో నంబర్‌లో బ్యాటింగ్ చేసిన రవీంద్ర జడేజా 2వ రోజు ఆట ముగిసే సమయానికి అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అలాగే మూడో రోజు ఆటలో సెంచరీ పూర్తి చేయాలని భావించాడు. కానీ 180 బంతుల్లో 2 సిక్సర్లు, 7 ఫోర్లతో 87 పరుగులు చేసి జో రూట్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. దీంతో పాటు జడేజా కూడా కేవలం 13 పరుగుల తేడాతో సెంచరీని కోల్పోయి నిరాశపరిచాడు.

ఆరో నంబర్‌లో బ్యాటింగ్ చేసిన రవీంద్ర జడేజా 2వ రోజు ఆట ముగిసే సమయానికి అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అలాగే మూడో రోజు ఆటలో సెంచరీ పూర్తి చేయాలని భావించాడు. కానీ 180 బంతుల్లో 2 సిక్సర్లు, 7 ఫోర్లతో 87 పరుగులు చేసి జో రూట్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. దీంతో పాటు జడేజా కూడా కేవలం 13 పరుగుల తేడాతో సెంచరీని కోల్పోయి నిరాశపరిచాడు.

5 / 6
ఈ మూడు అర్ధ సెంచరీల సాయంతో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 436 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న ఇంగ్లండ్ 26 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది.

ఈ మూడు అర్ధ సెంచరీల సాయంతో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 436 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న ఇంగ్లండ్ 26 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది.

6 / 6