ఢిల్లీపై ముంబై విజయం

| Edited By:

Apr 19, 2019 | 6:26 AM

ఐపీఎల్‌లో భాగంగా ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టును 40 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 30 పరుగులు, క్వింటన్ డీ కాక్ 35 పరుగులు, సూర్య కుమార్ యాదవ్ 26 పరుగులు చేశారు. హార్థిక్ పాండ్యా 3 సిక్స్‌లు, 2 ఫోర్లతో మెరిపించి 32 […]

ఢిల్లీపై ముంబై విజయం
Follow us on

ఐపీఎల్‌లో భాగంగా ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టును 40 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 30 పరుగులు, క్వింటన్ డీ కాక్ 35 పరుగులు, సూర్య కుమార్ యాదవ్ 26 పరుగులు చేశారు. హార్థిక్ పాండ్యా 3 సిక్స్‌లు, 2 ఫోర్లతో మెరిపించి 32 పరుగులు చేశాడు. కృనాల్ పాండ్యా 37 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఢిల్లీ బౌలర్లలో రబడకు 2 వికెట్లు, అమిత్ మిశ్రా, అక్సర్ పటేల్‌కు చెరో వికెట్ దక్కింది. 169 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 128 పరుగులు మాత్రమే చేయగలిగింది. పృధ్వీ షా 20, శిఖర్ ధావన్ 35, రిషబ్ పంత్ 7, అక్షర్ పటేల్ 26 పరుగులు చేశారు.