IPL 2025: ఒక్కో పరుగుకు రూ. 24.50 లక్షల సంపాదన.. కట్‌చేస్తే.. ఆ ఒక్క తప్పుతో రిషబ్ పంత్ జేబు ఖాళీ

LSG Captain Rishabh Pant: ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించింది. ముంబై జట్టు వరుసగా ఐదవ విజయాన్ని నమోదు చేసింది. ముంబై జట్టు ఇప్పుడు ఐదవ స్థానం నుంచి3వ స్థానానికి చేరుకుంది. రిషబ్ పంత్ కెప్టెన్సీలోని లక్నో జట్టు ఆరో స్థానంలో కొనసాగుతోంది. లక్నో 10వ మ్యాచ్‌లో ఐదవ ఓటమిని చవిచూసింది. ఐదు విజయాల నుంచి 10 పాయింట్లను కలిగి ఉంది.

IPL 2025: ఒక్కో పరుగుకు రూ. 24.50 లక్షల సంపాదన.. కట్‌చేస్తే.. ఆ ఒక్క తప్పుతో రిషబ్ పంత్ జేబు ఖాళీ
Lsg Rishabh Pant

Updated on: Apr 28, 2025 | 8:42 AM

LSG Captain Rishabh Pant: ఐపీఎల్ 2025లో ఒకవైపు రిషబ్ పంత్ ఒక పరుగుకు రూ. 24.50 లక్షలు సంపాదిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు, అతని జేబులోంచి రూ. 24 లక్షలు పోవడం గమనార్హం. ఏప్రిల్ 27న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత, అతనికి జరిమానా విధించారు. ఆ తర్వాత పంత్ రూ. 24 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. ఒక్కో పరుగుకు రూ. 24.50 లక్షలు సంపాదించే పంత్ రూ. 24 లక్షలు ఎందుకు చెల్లించాల్సి వచ్చిందని మీరు ఆలోచిస్తున్నారా? లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్‌గా ఉన్నందున, అతనికి స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా విధించారు. అంటే, వాంఖడేలో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో అతను తన జట్టు ఓవర్ రేట్‌ను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాడు.

స్లో ఓవర్ రేట్ కారణంగా రూ. 24 లక్షలు నష్టం..

అయితే, స్లో ఓవర్ రేట్ కారణంగా జట్టు కెప్టెన్‌కు విధించిన జరిమానా కేవలం రూ.12 లక్షలు మాత్రమే. కానీ, ఈ సీజన్‌లో పంత్, అతని బృందం చేసిన రెండవ తప్పు ఇది. కాబట్టి, తమ తప్పును పునరావృతం చేశారు. కాబట్టి, వారిపై రూ. 24 లక్షల జరిమానా విధించారు. పంత్‌పై విధించిన రూ.24 లక్షల జరిమానాతో పాటు, ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఎల్‌ఎస్‌జి ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉన్న ఆటగాళ్లు ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం రూ.6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం – ఏది తక్కువైతే అది – చెల్లించాల్సి ఉంటుంది.

రెండోసారి ఓవర్ రేటులో విఫలం..

ఏప్రిల్ 4న జరిగిన ఐపీఎల్ 2025 మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా రిషబ్ పంత్, అతని జట్టు లక్నో ఇప్పటికే జరిమానా విధించిన సంగతి తెలిసిందే. యాదృచ్చికంగా, ఆ మ్యాచ్ కూడా ముంబై ఇండియన్స్‌తో జరిగింది. అది లక్నోలోని ఎకానా స్టేడియంలో జరిగింది. ఆ మ్యాచ్‌లో, కెప్టెన్‌గా పంత్ తొలిసారి ఓవర్ రేట్‌ను కొనసాగించడంలో విఫలమయ్యాడు. దీని కారణంగా అతను రూ. 12 లక్షల జరిమానా చెల్లించాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి

అత్యంత ఖరీదైన ఐపీఎల్ ఆటగాడి ప్రతి పరుగు విలువ రూ. 24.50 లక్షలు..

రిషబ్ పంత్ ఐపీఎల్ 2025 లోనే కాదు, మొత్తం ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. అతన్ని లక్నో రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. లక్నో యజమాని సంజీవ్ గోయెంకా అతని కోసం ఖర్చు చేసిన డబ్బు ప్రకారం పంత్ ఆట ఆశించిన స్థాయిలో లేదు. ఐపీఎల్ 2025లో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో, పంత్ 12.22 సగటు, 100 కంటే తక్కువ స్ట్రైక్ రేట్‌తో 110 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us