IPL 2026: ఐపీఎల్ తోపులు.. కట్ చేస్తే.. సిల్లీ రీజన్‌తో బ్యాన్.. ఎవరేవరంటే.?

ఐపీఎల్ చరిత్రలో నిషేధానికి గురైన కొంతమంది ఆటగాళ్ల లిస్టు ఇప్పుడు చూసేద్దాం.. పృథ్వీ షా డోపింగ్ టెస్టులో విఫలమవగా, మనీష్ పాండే క్రమశిక్షణ ఉల్లంఘన కారణంగా బ్యాన్ అయ్యారు. ప్రవీణ్ తాంబే రిటైర్‌మెంట్ ప్రకటించకుండా విదేశీ లీగ్‌లో ఆడినందుకు బీసీసీఐ నిషేధం విధించింది.

IPL 2026: ఐపీఎల్ తోపులు.. కట్ చేస్తే.. సిల్లీ రీజన్‌తో బ్యాన్.. ఎవరేవరంటే.?
Ipl

Updated on: Feb 01, 2026 | 10:15 AM

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చరిత్రలో పలువురు ఆటగాళ్లు వివిధ నిబంధనల ఉల్లంఘన కారణంగా నిషేధాన్ని ఎదుర్కొన్నారు. డోపింగ్, క్రమశిక్షణ లేమి, బీసీసీఐ నియమాలను అతిక్రమించడం లాంటి కారణాలతో కొందరు ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడే అవకాశాన్ని కోల్పోయారు. ఈ జాబితాలో కొందరు స్టార్ ఆటగాళ్లు ఉన్న సంగతి తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ ఓపెనర్ పృథ్వీ షా 2019లో డోపింగ్ టెస్టులో విఫలమయ్యాడు. ఈ సంఘటన కారణంగా అతడు ఎనిమిది నెలల పాటు నిషేధానికి గురయ్యాడు. ఇది ఐపీఎల్‌లో ఒక ఆటగాడు డోపింగ్ ఉల్లంఘన కారణంగా నిషేధానికి గురైన కేసులలో ఒకటి.

ఐపీఎల్‌లో సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్ మనీష్ పాండే కూడా క్రమశిక్షణ ఉల్లంఘన కింద నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. 2011 సీజన్ ప్రారంభంలో నాలుగు మ్యాచ్‌ల పాటు అతడు నిషేధానికి గురయ్యాడు. ఇది ఆటగాళ్ల ప్రవర్తనకు సంబంధించి బీసీసీఐ కఠినమైన నిబంధనలకు నిదర్శనం. అలాగే, సీనియర్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబేను 48 ఏళ్ల వయసులో కోల్‌కతా నైట్ రైడర్స్‌ వేలంలో కొనుగోలు చేసింది. అయితే, అతడు ఐపీఎల్ 2020 సీజన్‌కు దూరమయ్యాడు. రిటైర్‌మెంట్ ప్రకటించకుండా దుబాయ్‌లో జరిగిన అనాధికారిక టీ10 లీగ్‌లో ఆడటం బీసీసీఐ నిబంధనలకు విరుద్ధమని తేలింది. ఈ కారణంగా బీసీసీఐ అతడిపై నిషేధం విధించింది. ఆటగాళ్లు విదేశీ లీగ్‌లలో పాల్గొనే ముందు బీసీసీఐ అనుమతి తప్పనిసరి అనే నిబంధనను ఈ ఘటన హైలైట్ చేస్తుంది.

ఇది చదవండి: కోహ్లీ బౌలర్ అయ్యింటే ఇతడిలా ఉండేవాడేమో.! ఈ యాంగ్రీ ప్లేయర్ ఎవరంటే.?

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి