Team India : రాహుల్ ఔట్, గిల్, పాండ్యా ఇన్.. సౌతాఫ్రికా టీ20 సిరీస్కు భారత జట్టులో భారీ మార్పులు
Team India : సౌతాఫ్రికా టూర్లో టెస్ట్ సిరీస్లో ఓటమి తర్వాత వన్డే సిరీస్ను 2-1తో గెలుచుకున్న టీమిండియా, ఇప్పుడు ఐదు మ్యాచ్ల టీ20I సిరీస్కు సిద్ధమవుతోంది. తొలి T20 మ్యాచ్ మంగళవారం (డిసెంబర్ 9) కటక్లోని బారాబతి స్టేడియంలో జరగనుంది.

Team India : సౌతాఫ్రికా టూర్లో టెస్ట్ సిరీస్లో ఓటమి తర్వాత వన్డే సిరీస్ను 2-1తో గెలుచుకున్న టీమిండియా, ఇప్పుడు ఐదు మ్యాచ్ల టీ20I సిరీస్కు సిద్ధమవుతోంది. తొలి T20 మ్యాచ్ మంగళవారం (డిసెంబర్ 9) కటక్లోని బారాబతి స్టేడియంలో జరగనుంది. ఈ సిరీస్కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరిస్తుండగా, ఐడెన్ మార్క్రమ్ నేతృత్వంలోని సౌతాఫ్రికాతో భారత్ తలపడుతుంది. ఇప్పటివరకు టీ20I సిరీస్లలో ఓటమి ఎరుగని సూర్యకుమార్, ఈ సిరీస్ను కూడా గెలిచి తన కెప్టెన్సీ రికార్డును కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.
బీసీసీఐ డిసెంబర్ 3న ప్రకటించిన 15 మంది సభ్యుల భారత టీ20 స్క్వాడ్లో కేవలం ఐదుగురు ఆటగాళ్లను మాత్రమే వన్డే జట్టు నుంచి తీసుకున్నారు. ఈ సిరీస్కు అత్యంత ముఖ్యమైన మార్పు, వన్డే సిరీస్ను విజయవంతంగా నడిపించిన కెప్టెన్ కేఎల్ రాహుల్కు టీ20 జట్టులో స్థానం దక్కలేదు. అలాగే వన్డేల్లో సెంచరీతో అదరగొట్టిన యశస్వి జైస్వాల్, యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి, బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్, ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ, వికెట్ కీపర్లు రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్లకు కూడా విశ్రాంతినిచ్చారు. అంతేకాకుండా జూన్ 2024లో టీ20I ఫార్మాట్ నుంచి రిటైర్ అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ఈ జట్టులో భాగం కాదు.
టీ20 స్పెషలిస్టులకు గాయం నుంచి కోలుకున్న సీనియర్లకు ఈ జట్టులో చోటు దక్కింది. మెడ గాయం కారణంగా వన్డే సిరీస్కు దూరమైన యువ స్టార్ శుభ్మన్ గిల్ తిరిగి జట్టులోకి వచ్చి వైస్ కెప్టెన్ బాధ్యతలు చేపట్టనున్నాడు. 2025 సెప్టెంబర్ 26 నుంచి గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా రీ-ఎంట్రీ ఇచ్చాడు. వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్న అనుభవజ్ఞుడైన పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చి బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహిస్తాడు. వీరితో పాటు శివమ్ దూబే, అభిషేక్ శర్మ, సంజు శాంసన్, జితేశ్ శర్మ, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి వంటి టీ20 స్పెషలిస్టులు కూడా జట్టులో ఉన్నారు.
మునుపటి సిరీస్ల నుంచి తమ స్థానాలను నిలబెట్టుకున్న ఐదుగురు ఆటగాళ్లు.. తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, కులదీప్ యాదవ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్. ఈ మార్పుల తర్వాత సౌతాఫ్రికా టీ20 సిరీస్ కోసం భారత జట్టు కూర్పు ఈ విధంగా ఉంది. సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్-కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వి.కీ), సంజు శాంసన్ (వి.కీ), జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్, కులదీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్. ఈ జట్టు సూర్యకుమార్ కెప్టెన్సీలో సౌతాఫ్రికా గడ్డపై టీ20 సిరీస్ గెలవాలని పట్టుదలతో ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




