AFG vs IND: ఏమన్నా కాంబినేషనా.. స్వ్కాడ్ చూస్తేనే సుస్సు పోసుకుంటారంతే.. ఆఫ్టాన్‌ను ఢీ కొట్టే భారత జట్టు ఇదే..?

Indias Probable Squad for Afghanistan T20 Series Revealed: ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న మూడు టి20ల సిరీస్‌కు టీమిండియా సన్నద్ధమవుతోంది. సెప్టెంబర్ 13న ఢిల్లీలో ప్రారంభమయ్యే ఈ సిరీస్ 2026 ఆసియా క్రీడలకు కీలక సన్నాహకంగా భావిస్తున్నారు. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో, వైభవ్ సూర్యవంశీ, హార్దిక్ పాండ్యా, అర్శదీప్ సింగ్ వంటి కీలక ఆటగాళ్లతో కూడిన ప్రాబబుల్ స్క్వాడ్ వివరాలు ఇక్కడ ఉన్నాయి.

AFG vs IND: ఏమన్నా కాంబినేషనా.. స్వ్కాడ్ చూస్తేనే సుస్సు పోసుకుంటారంతే.. ఆఫ్టాన్‌ను ఢీ కొట్టే భారత జట్టు ఇదే..?
Afg Vs Ind

Updated on: Aug 29, 2026 | 7:10 AM

Indias Probable Squad for Afghanistan T20 Series Revealed: టీమిండియాకు శ్రీలంక పర్యటనలో నిరాశ ఎదురైంది. రెండు టెస్టుల సిరీస్‌ను 0-1తో చేజికించుకున్న తర్వాత, జట్టు ఇప్పుడు తదుపరి అంతర్జాతీయ సవాలుకు సిద్ధమవుతోంది. ఆఫ్ఘనిస్తాన్‌తో మూడు టి20ల సిరీస్ రేపు నెల సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభం కానుంది. ఈ మూడు మ్యాచ్‌లకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక కానుంది. ఈ సిరీస్ భారత్ వేదికగానే జరుగుతున్నప్పటికీ, ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లోని పరిస్థితుల దృష్ట్యా ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు తమ ద్వైపాక్షిక సిరీస్‌లను భారత్ లేదా యూఏఈ వంటి తటస్థ వేదికలలో ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సిరీస్‌కు ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటికే తమ జట్టును ప్రకటించగా, బీసీసీఐ టీమిండియా స్క్వాడ్‌ను ప్రకటించాల్సి ఉంది. అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ప్రమాదకరమైన జట్లను సైతం ఓడించగల సత్తా ఆఫ్ఘనిస్తాన్‌కు ఉంది. కాబట్టి టీమిండియా వారిని ఏమాత్రం తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. మరోవైపు, ఈ సిరీస్ భారత ఆటగాళ్లకు రాబోయే 2026 ఆసియా క్రీడలకు సన్నాహాల కోసం అత్యంత కీలకమైన వేదికగా ఉపయోగపడనుంది.

టీమిండియా ఇటీవల టి20 ఫార్మాట్‌లో మిశ్రమ ఫలితాలను నమోదు చేసింది. గత జూలైలో జింబాబ్వేతో జరిగిన టి20 సిరీస్‌లో మూడు మ్యాచ్‌లను క్లీన్ స్వీప్ చేసి మంచి ప్రదర్శన కనబర్చింది. అయితే, అంతకు ముందు ఐర్లాండ్, ఇంగ్లాండ్‌తో ఆడిన టి20 సిరీస్‌లలో భారత్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేక తీవ్రంగా నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో, సెలెక్టర్లు ఆఫ్ఘనిస్తాన్‌తో పోరు కోసం పటిష్టమైన, సమతూకంతో కూడిన జట్టును ఎంపిక చేయాలని భావిస్తున్నారు.

జట్టు ఎంపికలో కీలకమైన ఓపెనింగ్ స్థానం కోసం ముగ్గురు ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. వైభవ్ సూర్యవంశీకి మొదటి ఛాయిస్‌గా చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. అతనికి జోడీగా అభిషేక్ శర్మ లేదా సంజూ శాంసన్‌లలో ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. జింబాబ్వే టూర్‌లో సంజూ శాంసన్‌ను పక్కన పెట్టారు. ఆ సిరీస్‌లో అభిషేక్ శర్మ పెద్దగా రాణించలేదు. అంతేకాకుండా, ఇంగ్లాండ్ సిరీస్‌లో సైతం అభిషేక్ శర్మ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయాడు. ఒకవేళ అభిషేక్ శర్మకు విశ్రాంతినిచ్చి సంజూ శాంసన్‌ను ఎంపిక చేస్తారేమో చూడాలి. ఒకవేళ ఇద్దరినీ ఎంపిక చేసినా, వైభవ్ సూర్యవంశీతో కలిసి సంజూ శాంసన్ ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

బౌలింగ్ విభాగంలో కూడా కొన్ని మార్పులు కనిపించనున్నాయి. జింబాబ్వే టూర్‌లో భాగం కాని అర్శదీప్ సింగ్, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే ఈ మూడు టి20ల సిరీస్‌లో తిరిగి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. అలాగే, అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సైతం తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాయకత్వ బాధ్యతల విషయానికి వస్తే, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించనున్నారు. యువ ప్రతిభావంతుడు తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా నియమితులయ్యే అవకాశం ఉంది.

మొత్తంగా, అంచనా ప్రకారం టీమిండియా స్క్వాడ్ ఇలా ఉండే అవకాశం ఉంది:

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శివం దూబే, హార్దిక్ పాండ్య, రింకు సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అర్శదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్.

ఈ సిరీస్ ద్వారా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పిస్తూనే, రాబోయే పెద్ద టోర్నమెంట్‌ల కోసం జట్టు సమతుల్యతను పరీక్షించనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us