IND vs ENG ODI Series: భారత వన్డే జట్టులో చేరిన టీ20 మిస్ట్రీ మ్యాన్.. ఇంగ్లండ్‌పై అరంగేట్రం చేసే ఛాన్స్?

India vs England ODIs Varun Chakravarthy: భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్‌తో ఫిబ్రవరి 6 నుంచి మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. నాగ్‌పూర్‌లో జరిగిన షార్ట్ క్యాంప్‌లో స్పిన్ మాంత్రికుడు వరుణ్ చక్రవర్తి జట్టులో చేరాడు. టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన వరుణ్, ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. అయితే, ఇది కేవలం నెట్స్ ప్రాక్టీస్ కోసమేనా లేదా వన్డే మ్యాచ్‌ల్లో ఆడతాడా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అతని ఎంపికపై మాజీ ఆఫ్ స్పిన్నర్ ఆర్. అశ్విన్ ముందే ఊహంచని సంగతి తెలిసిందే.

IND vs ENG ODI Series: భారత వన్డే జట్టులో చేరిన టీ20 మిస్ట్రీ మ్యాన్.. ఇంగ్లండ్‌పై అరంగేట్రం చేసే ఛాన్స్?
Varun Chakravarthy Vs Eng Odi Series

Updated on: Feb 04, 2025 | 3:51 PM

Varun Chakravarthy India ODI Squad: ఫిబ్రవరి 6 నుంచి ఇంగ్లాండ్‌తో మూడు వన్డేలు ఆడేందుకు భారత జట్టు సిద్ధమైంది. అయితే, ఈ మ్యాచ్‌లకు ముందు నాగ్‌పూర్‌లో జరిగే షార్ట్ క్యాంప్‌లో వరుణ్ చక్రవర్తి భారత వన్డే జట్టులో చేరాడు. సిరీస్ ప్రారంభానికి ముందు రోహిత్ శర్మ సేన షార్ట్ క్యాంప్ కోసం ఇక్కడికి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇంగ్లండ్ జట్టుపై టీ20ఐలలో అద్భుత ప్రదర్శన చేసిన వరుణ్ చక్రవర్తి.. టీ20 సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టీ20ఐలలో ఈ స్పిన్ మాంత్రికుడు 14 వికెట్లు పడగొట్టాడు. అన్ని మ్యాచ్‌లలో ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించాడు. రాజ్‌కోట్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మూడవ టీ20ఐలో ఐదు వికెట్లు పడగొట్టాడు. నాగ్‌పూర్‌లో జరిగే శిబిరంలో అతను చేరడంపై అధికారిక సమాచారం లేదు. ఇది కేవలం నెట్స్ కోసమేనా లేదా అతను వన్డేల్లో పాల్గొంటాడా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

33 ఏళ్ల అతను ఇంకా వన్డేల్లో అరంగేట్రం చేయలేదు. కానీ, దేశీయంగా తన రాష్ట్రం తమిళనాడు తరపున 23 లిస్ట్ ఏ మ్యాచ్‌లు ఆడాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో విజయ్ హజారే ట్రోఫీ సమయంలో అతను చివరిసారిగా ఆడాడు. వడోదరలో జరిగిన ప్రాథమిక క్వార్టర్ ఫైనల్ ఘర్షణలో రాజస్థాన్‌పై ఐదు వికెట్లు సాధించాడు.

ఇవి కూడా చదవండి

బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ ఆర్ అశ్విన్, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టులో వరుణ్ చేరికకు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ మేరకు అశ్విన్ మాట్లాడుతూ.. “అతను అక్కడ (ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు) ఉండాలా వద్దా అనే దాని గురించి మనమందరం మాట్లాడుకుంటున్నాం, అతను అక్కడ ఉండే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అతను చేరగలడని నాకు అనిపిస్తోంది. అన్ని జట్లు తాత్కాలిక జట్టును మాత్రమే పేర్కొన్నందున అవకాశం ఉంది. కాబట్టి, అతన్ని ఎంపిక చేయవచ్చు” అని ఆర్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు.

ఇంగ్లాండ్ వన్డేలకు భారత జట్టులో వరుణ్‌ను చేర్చవచ్చని అశ్విన్ భావించాడు. ఇప్పుడు కూడా అలాగే జరిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

“భారత్, ఇంగ్లాండ్ మధ్య వన్డే సిరీస్‌లో ఆడే అవకాశం వరుణ్‌కు లభిస్తుందని నేను భావిస్తున్నాను. అతన్ని నేరుగా ఛాంపియన్స్ ట్రోఫీకి తీసుకెళ్లడం అంత తేలికైన నిర్ణయం కాదని నేను భావిస్తున్నాను. అతను వన్డేలు ఆడలేదు.
ఇండియా vs ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌లోవారు అతనికి అవకాశం ఇస్తారని నేను భావిస్తున్నాను” అంటూ అశ్విన్ జోడించాడు.

ఇంగ్లాండ్ వన్డేలకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మాన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..