India Women vs South Africa Women, One-off Test: భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న చెన్నై టెస్టులో టీమిండియా భారీ స్కోరు సాధించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 4 వికెట్ల నష్టానికి 525 పరుగులు చేసి 89 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. మరుసటి రోజు, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ రిచా ఘోష్తో జతకట్టి రెండో రోజు రంగంలోకి బరిలోకి దిగి రికార్డును బద్దలు కొట్టారు. మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా భారత జట్టు నిలిచింది. అంతకుముందు ఈ రికార్డు 2024 ఫిబ్రవరిలో 575 పరుగులు చేసిన ఆస్ట్రేలియా పేరిట ఉంది. డ్రింక్స్ బ్రేక్ సమయానికి టీమ్ ఇండియా 591 పరుగులు చేసింది. ఆ తర్వాత 6 వికెట్లు కోల్పోయి 603 పరుగులకు భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్ను డిక్లెర్ చేసింది.
భారత్-దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సిరీస్ జరుగుతోంది. చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టులోని ఐదుగురు బ్యాటర్లు కలిసి దక్షిణాఫ్రికా ముందు పరుగుల పర్వం సృష్టించారు. జూన్ 28 నుంచి జులై 2 వరకు జరగనున్న ఈ మ్యాచ్లో తొలి రోజు భారత ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధాన 292 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పి పాకిస్థాన్ 20 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టారు.
1⃣ Double Ton
1⃣ Century
3⃣ Half-centuriesAnd a record breaking total! 🤩
Follow the match ▶️ https://t.co/4EU1Kp6YTG#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/GcH70yQESG
— BCCI Women (@BCCIWomen) June 29, 2024
షెఫాలీ అత్యధిక డబుల్ సెంచరీ సాధించి కేవలం 196 బంతుల్లో 205 పరుగులు చేసింది. కాగా, మంధాన 149 పరుగులు చేసింది. దీని తర్వాత జెమిమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్, రిచా ఘోష్ కూడా అర్ధశతకాలు సాధించారు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 4 వికెట్ల నష్టానికి 525 పరుగులు చేసింది. దీంతో మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక రోజులో అత్యధిక పరుగులు చేసిన 89 ఏళ్ల రికార్డును భారత్ బద్దలు కొట్టింది. మరుసటి రోజు, భారత జట్టు 603 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఇది మహిళల టెస్టు క్రికెట్లో ఇప్పటివరకు అత్యధిక స్కోరుగా నిలిచింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..