IND vs SA: 2 టెస్టులు.. 4 ఇన్నింగ్స్‌లు.. 77 సగటుతో 50+ రన్స్.. జోహన్నెస్‌బర్గ్‌లో కోహ్లీ కిరాక్ బ్యాటింగ్.. మరో 7 పరుగులు చేస్తే..!

|

Jan 03, 2022 | 7:07 AM

Virat Kohli: గత కొంత కాలంగా సెంచరీ కోసం ఎదురుచూస్తున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాట్ కూడా ఈ మ్యాచ్‌లో చెలరేగుతుందని అంతా భావిస్తున్నారు. ఇక్కడ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 3 సార్లు 50+ స్కోర్లు..

IND vs SA: 2 టెస్టులు.. 4 ఇన్నింగ్స్‌లు.. 77 సగటుతో 50+ రన్స్.. జోహన్నెస్‌బర్గ్‌లో కోహ్లీ కిరాక్ బ్యాటింగ్.. మరో 7 పరుగులు చేస్తే..!
Virat Kohli
Follow us on

India Vs South Africa 2nd Test: మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికా-భారత్ మధ్య జనవరి 3 నుంచి రెండో మ్యాచ్ జరగనుంది. జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్‌లో నెగ్గిన టీమిండియా చూపు జోహన్నెస్‌బర్గ్‌ను కైవసం చేసుకోవడం ద్వారా సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. గత కొంత కాలంగా సెంచరీ కోసం ఎదురుచూస్తున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాట్ కూడా ఈ మ్యాచ్‌లో చెలరేగుతుందని అంతా భావిస్తున్నారు. ఇక్కడ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 3 సార్లు 50+ స్కోర్లు సాధించిన కోహ్లీ ఇప్పటివరకు బ్యాటింగ్‌తో ఉన్న బలమైన రికార్డు సాధించడంతో ఇలాంటి ఆశలు పెరిగాయి.

కేవలం 2 టెస్టుల్లోనే భారీగా పరుగులు..
విరాట్ కోహ్లీ వాండరర్స్ స్టేడియంలో రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఈ రెండు టెస్టుల్లో కెప్టెన్ కోహ్లీ 77.50 సగటుతో 310 పరుగులు చేశాడు. విరాట్ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో మూడుసార్లు 50+ పరుగులు చేయడం విశేషం. జోహన్నెస్‌బర్గ్‌లో కోహ్లికి ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీ కూడా ఉంది.

2013లో ఇక్కడ ఆడిన కోహ్లీ..
2013 ఆఫ్రికన్ టూర్‌లో జోహన్నెస్‌బర్గ్‌లో విరాట్ కోహ్లి అద్భుత సెంచరీ సాధించాడు. ఆ సమయంలో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి 181 బంతుల్లో 119 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 18 ఫోర్లు కూడా బాదాడు. విరాట్‌కి ఇది తొలి ఆఫ్రికన్ టూర్ కావడం విశేషం. అతని టెస్ట్ కెరీర్‌లో ఇది ఐదో సెంచరీగా నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ కోహ్లి 193 బంతుల్లో 96 పరుగులు చేసి కేవలం నాలుగు పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు.

2018 నాటి ఆఫ్రికా టూర్‌లోని మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఈ మైదానంలో 106 బంతుల్లో 54 పరుగులు చేసిన విరాట్, రెండో ఇన్నింగ్స్‌లో కూడా 79 బంతుల్లో 41 పరుగులు చేశాడు.

ఇది మాత్రమే కాదు, జోహన్నెస్‌బర్గ్‌లో రెండవ అత్యంత విజయవంతమైన విదేశీ బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. విరాట్ కోహ్లీ జోహన్నెస్‌బర్గ్‌లో అత్యధిక టెస్ట్ పరుగులు చేసిన రెండవ విదేశీ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. కోహ్లీకి ముందు న్యూజిలాండ్ మాజీ ఆటగాడు జాన్ రీడ్ పేరు వచ్చింది. అతను వాండరర్స్‌లో ఆడిన 2 టెస్ట్ మ్యాచ్‌లలో 316 పరుగులు చేశాడు. అదే సమయంలో, ఈ మైదానంలో 4 మ్యాచ్‌ల్లో 263 పరుగులు నమోదైన ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం రికీ పాంటింగ్ పేరు మూడో స్థానంలో ఉంది. భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా ఇక్కడ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో 262 పరుగులు చేశాడు.

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో విరాట్ కోహ్లి కేవలం 7 పరుగులు చేస్తే.. ఈ మైదానంలో అత్యధిక టెస్టు పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కనున్నాడు.

Also Read: వారికి ఉద్యోగాలు ఇవ్వలేం.. మా వద్ద అలాంటి పాలసీ లేదు: దివ్యాంగ మహిళా ప్లేయర్‌కు షాకిచ్చిన పంజాబ్

IND vs SA: ఆ‍యన రిటైర్మెంట్ షాకిచ్చింది.. మాజట్టుపై తీవ్ర ప్రభావం: దక్షిణాఫ్రికా కెప్టెన్, కోచ్ కీలక వ్యాఖ్యలు