World Cup 2023: 31 ఏళ్ల తర్వాత స్పెషల్ మ్యాచ్ ఆడనున్న టీమిండియా.. చరిత్రలో కేవలం 2 సార్లు మాత్రమే ఇలా.. అదేంటో తెలుసా?

India Cricket Team Schedule in ODI World Cup 2023: ODI ప్రపంచ కప్ 2023కు రంగం సిద్ధమైంది. ఈ మేరకు కొత్త షెడ్యూల్‌ను కూడా ఐసీసీ ప్రకటించింది. ఈ తాజా మార్పులతో భారత క్రికెట్ జట్టు ఓ ప్రత్యేక మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. గత 31 ఏళ్లుగా ఈ ప్రత్యేకమైన రోజున టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ స్పెషల్ డేన భారత్ ఇంతకు ముందు కేవలం రెండు సార్లు మాత్రమే తలపడింది. వాటి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

World Cup 2023: 31 ఏళ్ల తర్వాత స్పెషల్ మ్యాచ్ ఆడనున్న టీమిండియా.. చరిత్రలో కేవలం 2 సార్లు మాత్రమే ఇలా.. అదేంటో తెలుసా?
Team India Odi World Cup

Updated on: Aug 11, 2023 | 4:00 PM

ICC ODI World Cup 2023: వన్డే ప్రపంచ కప్ 2023 ఈ సంవత్సరం అక్టోబర్-నవంబర్ మధ్య భారతదేశంలో జరగనుంది. టోర్నీకి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా టోర్నీ కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది. భారత్-పాకిస్థాన్ సహా 9 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మార్చాలని నిర్ణయించారు. ఇటువంటి పరిస్థితిలో టీమిండియా ప్రత్యేక రోజున ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. గత 31 ఏళ్లుగా ఈ ప్రత్యేకమైన రోజున టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.

31 ఏళ్ల తర్వాత ఈ స్పెషల్ డేన టీమిండియా బరిలోకి..

ముందుగా అక్టోబర్ 15 ఆదివారం అహ్మదాబాద్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉండగా.. ఇప్పుడు ఈ మ్యాచ్ అక్టోబర్ 14న జరగనుంది. నెదర్లాండ్స్‌తో భారత్ తన చివరి లీగ్ గేమ్ బెంగళూరులో నవంబర్ 11న జరగాల్సి ఉంది. కానీ, తాజా షెడ్యూ‌ల్‌లో ఈ డే అండ్ నైట్ నవంబర్ 12న జరగనుంది. ఆ రోజు దీపావళి పండుగ. దీపావళి రోజున టీం ఇండియా తరచుగా క్రికెట్ ఆడదు. అయితే ఈసారి ఈ ప్రత్యేకమైన రోజున కూడా భారత జట్టును చూసే అవకాశం అభిమానులకు లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

క్రికెట్ చరిత్రలో ఇలా రెండు సార్లు మాత్రమే..

దీపావళి ప్రత్యేక పండుగ రోజున టీం ఇండియా రెండుసార్లు మాత్రమే మ్యాచ్ ఆడింది. దీపావళి ప్రత్యేక పండుగ నాడు భారత క్రికెట్ జట్టు 1987 ప్రపంచ కప్ సందర్భంగా మొదటిసారి మ్యాచ్ ఆడింది. అదే సమయంలో, 1992లో దీపావళి పండుగ రోజున టీమిండియా చివరిసారిగా జింబాబ్వేతో మ్యాచ్ ఆడింది. విశేషమేమిటంటే రెండు సార్లు భారత క్రికెట్ జట్టు విజయం సాధించింది. 1987 ప్రపంచకప్‌లో టీమిండియా 56 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. అదే సమయంలో 1992లో జింబాబ్వేపై టీమిండియా 30 పరుగుల తేడాతో విజయం సాధించింది.

టీమ్ ఇండియా మ్యాచ్‌ల షెడ్యూల్-

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా అక్టోబర్ 8, చెన్నై

భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ అక్టోబర్ 11, ఢిల్లీ

భారత్ వర్సెస్ పాకిస్థాన్ అక్టోబర్ 14, అహ్మదాబాద్

భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ అక్టోబర్ 19, పూణె

భారత్ వర్సెస్ న్యూజిలాండ్ అక్టోబర్ 22, ధర్మశాల

భారత్ వర్సెస్ ఇంగ్లండ్ అక్టోబర్ 29, లక్నో

భారత్ వర్సెస్ క్వాలిఫయర్, నవంబర్ 2, ముంబై

భారత్ వర్సెస్ సౌతాఫ్రికా, నవంబర్ 5, కోల్‌కతా

భారత్ వర్సెస్ క్వాలిఫైయర్, నవంబర్ 12, బెంగళూరు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..