IND vs SA: కోహ్లీ గాయంపై బిగ్ అప్‌డేట్.. చివరి టెస్ట్‌లో ఆడడంపై హెడ్‌కోచ్ ఏమన్నాడంటే?

|

Jan 07, 2022 | 10:09 AM

జోహన్నెస్‌బర్గ్‌లో ఓటమితో దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకోవాలన్న టీమ్‌ఇండియా కల మరోసారి ఛిద్రమైంది. వాస్తవానికి ఇరు జట్ల మధ్య 3 టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది.

IND vs SA: కోహ్లీ గాయంపై బిగ్ అప్‌డేట్.. చివరి టెస్ట్‌లో ఆడడంపై హెడ్‌కోచ్ ఏమన్నాడంటే?
Ind Vs Sa Virat Fitness
Follow us on

IND vs SA: జోహన్నెస్‌బర్గ్‌లో ఓటమితో దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకోవాలన్న టీమ్‌ఇండియా కల మరోసారి ఛిద్రమైంది. వాస్తవానికి ఇరు జట్ల మధ్య 3 టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది. అంటే కేప్‌టౌన్‌లో జరిగే మూడో టెస్టు నిర్ణయాత్మకంగా, ఉత్కంఠభరితంగా మారింది. ఈ నిర్ణయాత్మక మ్యాచ్‌లో, గాయం కారణంగా జోహన్నెస్‌బర్గ్ టెస్టుకు దూరమైన విరాట్ కోహ్లీ ప్రాముఖ్యత కూడా కీలకం కానుంది. విరాట్ కోహ్లీ టెస్టు సిరీస్‌లో ఆఖరి, నిర్ణయాత్మక పోరులో అడుగుపెడతాడా లేదా అనే దాని గురించి ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పెద్ద అప్‌డేట్ అందించారు.

జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన రెండో టెస్టులో రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అవుటైన తర్వాత కేఎల్ రాహుల్ జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టాడు. టెస్టు కెప్టెన్సీలో రాహుల్‌కి ఇదే అరంగేట్రం. అయితే, అతను తన కెప్టెన్సీని విజయంతో ప్రారంభించలేకపోయాడు. జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన 240 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు కాపాడుకోవడంలో విఫలమై, 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమి తర్వాత ప్రస్తుతం అందరిలో ఉన్న ఒకే ఒక్క ప్రశ్న ఏమిటంటే, దక్షిణాఫ్రికాతో జరిగే మూడో, చివరి టెస్టుకు కోహ్లీ తిరిగి వస్తాడా? లేదా?

రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
విరాట్ కోహ్లి, టీమ్ ఇండియాకు సంబంధించిన ఈ పెద్ద ప్రశ్నకు జొహన్నెస్‌బర్గ్ టెస్ట్ తర్వాత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ నుంచి సమాధానం వచ్చింది. విరాట్ కోహ్లి గాయం, అతని ఫిట్‌నెస్‌పై తాజా అప్‌డేట్‌లను అందించాడు. రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ.. ‘నెట్స్‌లో కోహ్లీ ప్రాక్టీస్ చేస్తున్న తీరు చూస్తే ఫిట్‌గా కనిపిస్తున్నాడు. అతను ఇంకా ఫిజియోతో చర్చించలేదు. ప్రస్తుతం అయితే ఫిట్‌నెస్‌‌తోనే కనిపిస్తున్నాడు’ అని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. కేప్‌టౌన్‌లో జరగనున్న సిరీస్‌లోని మూడవది, చివరి టెస్టులో విరాట్ కోహ్లి తిరిగి రావడాన్ని చూడవచ్చని ద్రవిడ్ ప్రకటన ద్వారా స్పష్టమైంది. ఇదే జరిగితే, హనుమ విహారి ప్లేయింగ్ XI నుంచి తప్పుకోవాల్సి రావొచ్చు.

కేప్ టౌన్ చరిత్ర మార్చేనా..!
దక్షిణాఫ్రికాలో జోహన్నెస్‌బర్గ్ టీమ్ ఇండియాకు బలమైన కోట. తాజాగా ఆతిథ్య జట్టు చేతిలో 7 వికెట్ల ఓటమికి ముందు భారత జట్టు ఈ మైదానంలో ఏ మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. ఈ ఓటమి తర్వాత దక్షిణాఫ్రికాలో తొలి టెస్టు సిరీస్ గెలవడం టీమిండియాకు కష్టతరంగా మారింది. అసలైన, మూడో టెస్టు కేప్ టౌన్‌లో జరగనుంది. ఇక్కడ భారత రికార్డు పేలవంగా ఉంది. కేప్ టౌన్ వేదికగా భారత్ ఆడిన గత 5 మ్యాచ్‌ల్లో 3 ఓడిపోయింది. 2 డ్రాలు అయ్యాయి. అంటే ఒక్కటి కూడా గెలవలేదు. అదేమిటంటే.. తొలి టెస్టు సిరీస్ విజయం కోసం ప్రస్తుతం భారత జట్టు కేప్ టౌన్ వేదికగా తన చరిత్రను మార్చుకోవాల్సి ఉంటుంది.

Also Read: IPL 2022: హైదరాబాద్ వద్దంది.. బెంగళూరు ముద్దంది.. కోహ్లీ వారసుడిగా ఎస్‌ఆర్‌హెచ్‌ మాజీ ప్లేయర్?

Ravi Shastri vs Ganguly: కెప్టెన్సీ వివాదంపై రవిశాస్త్రి కీలక ప్రకటన.. అసలు కారణం అదేనంటూ గంగూలీపై సెటైర్లు