IND vs ENG 5th Test: సిరీస్ విజయంతో భారత్.. పరువు కోసం ఇంగ్లండ్.. ఐదో టెస్ట్ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ? పూర్తి సమాచారం ఇదిగో..

India vs England 5th Test: రాంచీ వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్ లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో రోహిత్‌ సేన మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఐతే, చివరి ఐదో టెస్టు మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని ఇంగ్లండ్ జట్టు చూస్తోంది.

IND vs ENG 5th Test: సిరీస్ విజయంతో భారత్.. పరువు కోసం ఇంగ్లండ్.. ఐదో టెస్ట్ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ? పూర్తి సమాచారం ఇదిగో..
India Vs England
Follow us

|

Updated on: Feb 27, 2024 | 8:11 AM

India Vs England 5th Test: భారత్ -ఇంగ్లండ్ (India Vs England) మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ ముగిసింది. రాంచీ వేదికగా జరిగిన ఈ ఉత్కంఠ మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ తర్వాత భారత్ 307 పరుగులు చేసింది. ఇక్కడ 40 పరుగులకు పైగా ఆధిక్యం సాధించిన ఇంగ్లిష్ జట్టుకు నాలుగో ఇన్నింగ్స్‌లో మంచి లక్ష్యాన్ని అందించే అవకాశం లభించింది. కానీ, భారత స్పిన్నర్లు ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను కేవలం 145 పరుగులకే కుదించారు. 192 పరుగుల లక్ష్యాన్ని రోహిత్ శర్మ సేన 5 వికెట్లు కోల్పోయి నెగ్గింది. ఇప్పుడు మరో మ్యాచ్‌ మిగిలుండగానే భారత్‌ సిరీస్‌ కైవసం చేసుకుంది. కాబట్టి, చివరి ఐదో టెస్టు మ్యాచ్ సిరీస్‌పై ఎటువంటి ప్రభావం చూపదు. అయితే, ఇంగ్లండ్ మాత్రం, చివరి మ్యాచ్‌ను గెలిచి, ఆత్మవిశ్వాసం కూడగట్టుకునే పనిలో పడింది. మరోవైపు రోహిత్ శర్మ సేన మరో విజయంతో దూకుడు ప్రదర్శించాలని కోరుకుంటోంది.

భారత్-ఇంగ్లండ్ ఐదో టెస్ట్ మ్యాచ్ ఎప్పుడు?

భారత్-ఇంగ్లండ్ ఐదో టెస్ట్ మ్యాచ్ మార్చి 07 నుంచి మార్చి 11 వరకు జరగనుంది.

భారత్-ఇంగ్లండ్ ఐదో టెస్టు మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?

ధర్మశాలలోని హిమాచల్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ ఐదో టెస్టు మ్యాచ్ నిర్వహించనున్నారు.

భారత్-ఇంగ్లండ్ ఐదో టెస్ట్ మ్యాచ్ ఎక్కడ చూడాలి?

భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లోని ఐదవ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం JioCinema యాప్‌లో అందుబాటులో ఉంటుంది. స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్‌లో కూడా మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.

భారత్-ఇంగ్లండ్ ఐదో టెస్టు సిరీస్ ఏ సమయంలో ప్రారంభమవుతుంది?

భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లో ఐదో మ్యాచ్ IST ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది.

భారత టెస్టు జట్టు: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, రజత్ పటీదార్, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, శ్రీకర్ భరత్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్.

ఇంగ్లండ్ టెస్ట్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జేమ్స్ ఎమర్సన్, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, షోయబ్ బషీర్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ, జాక్ లీచ్, ఒల్లీ పోప్, ఆలీ రాబిన్సన్. జో రూట్, మార్క్ వుడ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..