Virat Kohli: టీ20ల్లో విరాట్ విఫలమైతే.. వేరొకరికి ఛాన్స్.. ప్రయత్నాలు మొదలెట్టిన బీసీసీఐ..

|

Jul 07, 2022 | 8:50 PM

ఈ ఏడాది 2022 టీ20 ప్రపంచకప్ అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో జరగనుంది. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌‌నకు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనుంది.

Virat Kohli: టీ20ల్లో విరాట్ విఫలమైతే.. వేరొకరికి ఛాన్స్.. ప్రయత్నాలు మొదలెట్టిన బీసీసీఐ..
Virat Kohli
Follow us on

Virat Kohli: భారత బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ పేలవ ఫామ్ కొనసాగుతోంది. త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని కోహ్లీ పేలవమైన ఫామ్‌ ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో భారత జట్టు మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది. ఇంగ్లండ్ సిరీస్‌లో మంచి ప్రదర్శన చేసే ఆటగాళ్లు రాబోయే T20 ప్రపంచ కప్ జట్టు కోసం తమ వాదనను బలపరుస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ తన ఫామ్‌కు తిరిగి రాగలడా అనేది అతిపెద్ద ప్రశ్నగా మారింది.

‘వరుసగా విఫలం అవుతోన్న విరాట్’

నిజానికి ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్‌ విరాట్‌ కోహ్లికి చక్కటి అవకాశంగా భావిస్తున్నారు. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ రాణించగలిగితే, T20 ప్రపంచ కప్ దృష్టిలో భారత జట్టుకు ఉపశమనం కలిగించే వార్తలు వస్తాయి. కానీ, కోహ్లీ ఫ్లాప్ షో నిరంతరాయంగా కొనసాగుతోంది. దీంతో ఇంగ్లండ్‌లోనూ ఇదే జరిగితే రాబోయే T20 ప్రపంచ కప్‌‌నకు భారత సెలెక్టర్లు మరొకరి వైపు మొగ్గుచూపే అవకాశం ఉందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ విషయమై బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. కోహ్లీ చాలా కాలంగా భారత్ తరపున ఆడుతున్నాడు. అతను గొప్ప ఆటగాడు అనడంలో సందేహం లేదు. కానీ, తరచుగా ఫ్లాప్‌ అవుతుండడంతో ప్రమాద ఘంటికలు మోగుతాయి’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి

విరాట్ కోహ్లీకి ప్రత్యామ్నాయం కోసం బీసీసీఐ సెర్చింగ్..

ఈ ఏడాది అక్టోబర్‌లో టీ20 ప్రపంచకప్‌ జరగనుంది. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌నకు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనుంది. BCCI ప్రస్తుతం T20 ప్రపంచ కప్ కోసం విరాట్ కోహ్లీకి ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నట్లు మీడియా నివేదికలు వస్తున్నాయి. దీని కారణంగా ఇంగ్లాండ్‌తో జరిగే T20 సిరీస్ విరాట్ కోహ్లీకి చాలా కీలకమైనదిగా మారింది. ఇక్కడ రాణిస్తేనే, ఆస్ట్రేలియా వెళ్లే టీంలో విరాట్ ఉంటాడు. అదే సమయంలో, ఇంగ్లండ్‌తో సిరీస్ తర్వాత, భారత జట్టు వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ను ఆడనుంది. అయితే, ఆ పర్యటనకు నన్ను ఎంపిక చేయవద్దని విరాట్ కోరినట్లు కూడా మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా, కోహ్లీకి మాత్రం ఇంగ్లండ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ చాలా కీలకం అనడంలో ఎలాంటి సందేహం లేదు.