
Sri Lanka Breaks Silence on Bangladeshs T20 World Cup Ban Amidst ICC Dispute: 2026 టీ20 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ను ఐసీసీ బహిష్కరించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంపై సహ ఆతిథ్య దేశమైన శ్రీలంక తన మౌనాన్ని వీడి, అధికారిక ప్రకటన చేసింది. భద్రతా కారణాలను పేర్కొంటూ భారత్లో పర్యటించడానికి బంగ్లాదేశ్ నిరాకరించడంతో, ఐసీసీ వారి హైబ్రిడ్ మోడల్ అభ్యర్థనను తోసిపుచ్చింది. దీని ఫలితంగా, బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ను ఐసీసీ ఎంపిక చేసింది.
ఈ అనూహ్య పరిణామాల మధ్య శ్రీలంక క్రికెట్ బోర్డు తాము ఈ విషయంలో పూర్తి తటస్థ వైఖరిని అవలంబిస్తున్నట్లు ప్రకటించింది. బంగ్లాదేశ్ తమ మ్యాచ్లను శ్రీలంకలో ఆడాలని విజ్ఞప్తి చేసినప్పటికీ, శ్రీలంక ఐసీసీ నిబంధనలకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. శ్రీలంక క్రికెట్ కార్యదర్శి బందుల దిసానాయక మాట్లాడుతూ, భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలన్నీ తమకు స్నేహపూర్వక దేశాలని, కాబట్టి తాము ఎవరి పక్షం వహించబోమని తెలిపారు. గతంలో 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో భారత్కు అనుకూలంగా వ్యవహరించిన ఐసీసీ, ఇప్పుడు బంగ్లాదేశ్ పట్ల కఠినంగా వ్యవహరించిందని విమర్శలు ఉన్నప్పటికీ, శ్రీలంక మాత్రం తమ పొరుగు దేశాలతో దౌత్య సంబంధాలను కాపాడుకునేందుకే ప్రాధాన్యత ఇస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..