
IPL: 2008లో ప్రారంభమైన ఐపీఎల్ (IPL) ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద టీ20 లీగ్గా ఎదిగింది. ఆ తొలి సీజన్లో ఆడిన చాలా మంది ఆటగాళ్లు ఇప్పుడు రిటైర్ అయ్యారు. కానీ కొంతమంది మాత్రం ఇప్పటికీ కొనసాగుతూ అరుదైన రికార్డు సృష్టించారు. ఆ లిస్ట్ లో ఎవరున్నారో ఓసారి చూద్దాం..
విరాట్ కోహ్లీ 2008 నుంచి ఇప్పటివరకు ఒకే జట్టు ఆర్సీబీ తరపున ఆడుతూ ఎంతో గుర్తింపు పొందాడు. IPL చరిత్రలో ఒకే ఫ్రాంచైజీకి నిరంతరం ఆడుతున్న ఏకైక ప్లేయర్గా నిలిచాడు.
రోహిత్ శర్మ డెక్కన్ చార్జర్స్తో ప్రారంభించి, తరువాత ముంబై ఇండియన్స్కు చేరి 5 టైటిళ్లు గెలిపించాడు. ప్రస్తుతం కూడా అతని అనుభవం జట్టుకు కీలకం.
ఎంఎస్ ధోనీ చెన్నైకి ప్రాణంలా మారాడు. అతని కెప్టెన్సీలో జట్టు ఐదు టైటిళ్లు గెలుచుకుంది. 2026లో కూడా అతను జట్టులో కొనసాగుతున్నాడు.
రవీంద్ర జడేజా ఆల్రౌండర్గా కీలక పాత్ర పోషించాడు. 2023 ఫైనల్లో చివరి రెండు బంతుల్లో 10 పరుగులు చేసి CSKకి టైటిల్ అందించాడు. ఐపీఎల్ 2026లో అతను రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడనున్నాడు.
మనీష్ పాండే IPLలో శతకం చేసిన తొలి భారతీయ బ్యాటర్. అనేక జట్లకు ఆడుతూ తన విలువను నిరూపించాడు.
అజింక్య రహానే కూడా తన టెక్నిక్తో గుర్తింపు పొందాడు. 2023లో CSK విజయంలో కీలక పాత్ర పోషించి, ప్రస్తుతం KKR కెప్టెన్గా కొనసాగుతున్నాడు.
ఇషాంత్ శర్మ 2008లో KKRతో తన IPL కెరీర్ ప్రారంభించాడు. అనేక జట్లకు ఆడిన అతను ఇప్పుడు గుజరాత్ టైటాన్స్లో కీలక బౌలర్గా కొనసాగుతున్నాడు. అతని అనుభవం జట్టుకు సమతుల్యతను అందిస్తోంది.
ఐపీఎల్ 2008 నుంచి 2026 వరకు కొనసాగిన ఈ 7 ఆటగాళ్లు కేవలం ప్లేయర్లు కాదు, లెజెండ్స్. వారి క్రమశిక్షణ, ఫిట్నెస్, ఆటపై ప్రేమ కొత్త తరం ఆటగాళ్లకు ఆదర్శంగా నిలుస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..