Team India: కప్పును ఇంటికి తీసుకురండి.. మహిళ జట్టుకు గుడ్ లక్ చెప్పిన టీమిండియా ప్లేయర్స్

India Women vs South Africa Women, Final: ఆదివారం నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరగబోయే ఫైనల్లో భారత్.. దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ ప్రపంచకప్ కొత్త ఛాంపియన్‌ను చూడబోతోంది. సొంత గడ్డపై జరుగుతున్న ఈ టోర్నమెంట్‌లో హర్మన్‌ప్రీత్ సేన తమ తొలి ఐసీసీ టైటిల్‌ను గెలవాలని దేశం మొత్తం కోరుకుంటోంది.

Team India: కప్పును ఇంటికి తీసుకురండి.. మహిళ జట్టుకు గుడ్ లక్ చెప్పిన టీమిండియా ప్లేయర్స్
Womens World Cup 2025

Updated on: Nov 02, 2025 | 11:31 AM

Women’s World Cup 2025 Final: భారత మహిళా క్రికెట్ జట్టు ఐసీసీ ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకోవడం దేశానికే గర్వకారణం. సెమీఫైనల్లో అప్రతిహత ఆస్ట్రేలియా జట్టును చిత్తు చేసి, రికార్డు ఛేదనతో తుది పోరులోకి అడుగుపెట్టిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ ముఖ్యమైన ఘట్టంలో, భారత పురుషుల క్రికెట్ జట్టు సభ్యులు శుభ్‌మన్ గిల్ (Shubman Gill), జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah), సూర్యకుమార్ యాదవ్ (SKY) సహా పలువురు ఆటగాళ్లు.. ‘కప్పును ఇంటికి తీసుకురండి’ అంటూ మన ఉమెన్ ఇన్ బ్లూకు ప్రత్యేక సందేశాలు పంపి, వారిలో మరింత ఉత్సాహాన్ని నింపారు.

ధైర్యంగా ఆడండి, దేశం మీ వెంటే..!

ఆస్ట్రేలియా టీ20 పర్యటనలో ఉన్న పురుషుల జట్టు, ఈ మెగా ఫైనల్‌కు ముందు హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని మహిళా జట్టుకు తమ హృదయపూర్వక శుభాకాంక్షలను వీడియో సందేశాల ద్వారా తెలియజేశారు.

ఇవి కూడా చదవండి

జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)..

“ప్రపంచకప్ ఫైనల్‌లో ఆడే అవకాశం తరచుగా రాదు. కాబట్టి ఆ క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించండి. కొత్తగా ఏమీ ప్రయత్నించాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పటికే అద్భుతంగా ఆడుతున్నారు. మీపై మీకు నమ్మకం ఉంచండి. మీ ఉత్తమ ప్రదర్శన ఇవ్వండి. మిగతావన్నీ వాటంతట అవే సరిగా జరుగుతాయి” అంటూ చెప్పుకొచ్చాడు. బుమ్రా మాటల్లోని స్థిరత్వం, నమ్మకం జట్టుకు ఎంతగానో ఉపయోగపడతాయి.

సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav – SKY)..

“మీరు ఇప్పటి వరకూ అద్భుతమైన టోర్నమెంట్ ఆడారు. ఈ క్షణాన్ని ఆస్వాదించండి, మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి. ఫలితం గురించి ఆలోచించకుండా ఆటను ఆస్వాదించండి. మీరు చేస్తున్నదే సరైనది” అంటూ SKY తనదైన శైలిలో కూల్‌గా ఆడాలని సూచించారు.

శుభ్‌మన్ గిల్ (Shubman Gill)..

యువ కెరటం శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ “మీ పోరాటం అద్భుతం! ధైర్యంగా ఆడండి, భయపడకండి. మీరు ఇప్పటికే దేశానికి గర్వకారణం అయ్యారు. ఈ ఫైనల్‌లో మీ సత్తా చూపించండి. భారత్ విజయం సాధిస్తుందని మాకు నమ్మకం ఉంది” అని సందేశం ఇచ్చాడు.

ఇతర ఆటగాళ్ల మద్దతు: కోచ్ గౌతమ్ గంభీర్ సైతం… “మీరు చరిత్ర సృష్టించారు. ఇప్పుడు కేవలం చివరి అడుగు మాత్రమే మిగిలి ఉంది, ఆ అడుగును ధైర్యంగా వేయండి. కప్పును ఇంటికి తీసుకురండి!” అని ఉద్వేగభరితమైన సందేశం ఇచ్చారు. యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ నవ్వుతూ, “ట్రోఫీ ఇక్కడే ఉంది, మీరు వెళ్లి దాన్ని తీసుకురావాలి అంతే” అని జట్టుకు చిన్నపాటి లక్ష్యాన్ని నిర్దేశించారు.

రికార్డుల రారాణి.. మన మహిళా జట్టు..

సెమీఫైనల్‌లో 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి, భారత మహిళా జట్టు ఒక చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. మహిళల వన్డే చరిత్రలోనే ఇది అత్యధిక లక్ష్య ఛేదన కావడం విశేషం. ఈ విజయం మన మహిళా క్రికెట్‌లో ఒక కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపింది. జెమీమా రోడ్రిగ్స్ (127 నాటౌట్) వీరోచిత శతకం, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (89) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ జట్టును ఫైనల్‌కు చేర్చాయి.

కొత్త ఛాంపియన్‌ కోసం ఎదురుచూపులు..

ఆదివారం నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరగబోయే ఫైనల్లో భారత్.. దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ ప్రపంచకప్ కొత్త ఛాంపియన్‌ను చూడబోతోంది. సొంత గడ్డపై జరుగుతున్న ఈ టోర్నమెంట్‌లో హర్మన్‌ప్రీత్ సేన తమ తొలి ఐసీసీ టైటిల్‌ను గెలవాలని దేశం మొత్తం కోరుకుంటోంది.

సమస్త భారతావని మన ఉమెన్ ఇన్ బ్లూ వెంటే ఉంది. పురుషుల జట్టు ఇచ్చిన ఈ ప్రోత్సాహం ఫైనల్ పోరులో మరింత స్ఫూర్తినిస్తుందని ఆశిద్దాం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us