Ambati Rayudu Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన చెన్నై ప్లేయర్.. ముంబైలో చివరి మ్యాచ్..

|

May 14, 2022 | 1:33 PM

చెన్నై సూపర్ కింగ్స్ వెటరన్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటించాడు. IPL 2022 తర్వాత ఈ లీగ్‌కి కూడా గుడ్‌బై చెప్పనున్నాడు.

Ambati Rayudu Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన చెన్నై ప్లేయర్.. ముంబైలో చివరి మ్యాచ్..
Ambati Rayudu Retirement
Follow us on

తన బ్యాట్ బలంతో చెన్నై సూపర్ కింగ్స్‌(Chennai super kings)ను ఎన్నో మ్యాచ్‌లు గెలిపించిన అంబటి రాయుడు(Ambati Rayudu) రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్ 2022 తర్వాత ఈ లీగ్‌కు వీడ్కోలు పలకాలని రాయుడు నిర్ణయించుకున్నాడు. ప్రస్తుత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శన పేలవంగా ఉంది. ప్లేఆఫ్ రేసు నుంచి జట్టు నిష్క్రమించింది. ఈ సీజన్‌లో రాయుడు ప్రదర్శన కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బహుశా అందుకే ఈ 36 ఏళ్ల బ్యాట్స్‌మెన్ ప్రస్తుతం ఐపీఎల్‌కి కూడా గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నాడు.

ఐపీఎల్ 2022లో చెన్నై సూపర్ కింగ్స్‌కు కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ జట్టు తన చివరి మ్యాచ్‌ని మే 15న గుజరాత్ టైటాన్స్‌తో, మే 20న రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో రాయుడు తన కెరీర్‌లో చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడబోతున్నాడు.

Also Read: IPL 2022: అదృష్టాన్ని మార్చిన కెప్టెన్ త్యాగం.. ఓపెనింగ్‌లో అదరగొట్టిన ప్లేయర్.. కేవలం 29 బంతుల్లో 7 సిక్సర్లు, 4 ఫోర్లతో ఊచకోత..

ఇవి కూడా చదవండి

T20 World Cup 2022: ఆల్ రౌండ్ ప్రతిభతో ఐపీఎల్‌లో మెరిసినా.. హార్దిక్ ఆ సమస్యే టీమిండియాకు ప్రమాదకరంగా మారొచ్చు..