Video: మోస్ట్ మెమరబుల్ టీమిండియా మ్యాచ్ ఇదే.. కన్నీళ్లు ఆగలేదు: లగాన్ హీరో భావోద్వేగం

Aamir Khan On 2011 World Cup Sachin Retirement: అమీర్ ఖాన్, 2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌ను తన అత్యంత మరపురాని క్రికెట్ మ్యాచ్‌గా చెప్పుకొచ్చాడు. సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ కూడా చాలా ప్రత్యేకమని పేర్కొన్నారు. భారత క్రికెట్ జట్టుపై అభిమానంతోపాటు భారత అండర్-19 మహిళా జట్టు విజయంపై ఆనందం వ్యక్తం చేశారు. గతరాత్రి భారత్-ఇంగ్లండ్ టీ20 సిరీస్‌ను కూడా ఆయన వీక్షించిన సంగతి తెలిసిందే.

Video: మోస్ట్ మెమరబుల్ టీమిండియా మ్యాచ్ ఇదే.. కన్నీళ్లు ఆగలేదు: లగాన్ హీరో భావోద్వేగం
Aameer Khan Team India

Updated on: Feb 03, 2025 | 3:22 PM

Aamir Khan Most Memorable India Cricket Match: భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 5వ, చివరి ట20 అంతర్జాతీయ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి 150 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి 4-1తో సిరీస్‌ని కైవసం చేసుకుంది.

ముంబైలో జరిగిన ఈ రికార్డు బద్దల మ్యాచ్‌కు పలువురు ప్రముఖులు సాక్షులుగా నిలిచారు. అమితాబ్ బచ్చన్, అతని కుమారుడు అభిషేక్ బచ్చన్, అమీర్ ఖాన్ కూడా ఈ మ్యాచ్‌ని చూడటానికి చాలా మంది పెద్ద బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. భారతదేశ విజయం తర్వాత, అమీర్ తన ఆలోచనలను పంచుకున్నాడు. భారత క్రికెట్ చరిత్రలో తన మరపురాని మ్యాచ్ గురించి చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌ను చిరస్మరణీయంగా అభివర్ణించిన ఆమీర్ ఖాన్ బాలీవుడ్ సూపర్‌హిట్ నటుల్లో ఒకరైన అమీర్ ఖాన్ వీడియోను బీసీసీఐ షేర్ చేసింది. ఇందులో భారత జట్టు 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ను ఈ అనుభవజ్ఞుడు మరపురాని క్షణంగా అభివర్ణించాడు. ఆ తర్వాత, సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ క్షణాన్ని కూడా అతను ప్రత్యేకంగా అభివర్ణించాడు.

ఇది కూడా చదవండి: IPL 2025: రాజస్థాన్ రాయల్స్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్ 2025 నుంచి తప్పుకోనున్న శాంసన్..?

ఈ క్రమంలో అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘భారత జట్టు మైదానంలో ఎప్పుడు చూసినా లోపల ఏదో ఒక ఫీలింగ్‌ ఉంటుంది. దాని అర్థం ఏమిటో నాకు తెలియదు, నేను ఏ హోదాలోనైనా భారత క్రికెట్‌ జట్టులో ఉండి ఉంటే అది నాకు చాలా పెద్ద విషయం. 2011 వరల్డ్ కప్ ఫైనల్ గురించి చెప్పాలంటే నాకు చాలా గుర్తుండిపోయే మ్యాచ్. ఆ రోజు మనందరికీ చాలా ప్రత్యేకమైనది. నాకు గుర్తుండిపోయే రెండవ మ్యాచ్ సచిన్ రిటైర్మెంట్ మ్యాచ్ అని నేను అనుకుంటున్నాను. ఆ మ్యాచ్‌లో కూడా నేను ఇక్కడే ఉన్నాను. నేను సచిన్‌కి పెద్ద అభిమానిని. అతను నా నంబర్-1 ఫేవరెట్ క్రికెటర్. ఎప్పటికీ అలానే ఉంటాడు. ఆ మ్యాచ్ చూడటం నిజంగా ఆనందించాను. ఈ మ్యాచ్‌లో భారత్-ఇంగ్లండ్‌ల చివరి మ్యాచ్‌ను చూసి ఆనందించాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

అనంతరం భారత అండర్-19 మహిళా క్రికెట్ జట్టుకు విజయోత్సవ శుభాకాంక్షలు కూడ తెలిపాడు. ఆయన మాట్లాడుతూ.. “మన అమ్మాయిలకు చాలా అభినందనలు, మేం వారి గురించి చాలా గర్వపడుతున్నాం. టీ20 ఐసీసీ టోర్నమెంట్‌ను రెండవ సారి గెలిచారు’ అంటూ తెలిపాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..