Vinayaka Chavithi 2024: ఇష్టదైవానికి అనంత్ అంబానీ అదిరిపోయే కానుక .. 20 కేజీల బంగారంతో..

|

Sep 06, 2024 | 7:52 PM

ఐకానిక్ లాల్‌బాగ్చా రాజా వినాయక ఉత్సవం మాత్రం వెరీ వెరీ స్పెషల్. ఇక్కడికి గణపయ్య ముఖదర్శనం చేసుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు. ఈసారి లాల్‌బాగ్ రాజు మొదటి చిత్రం బయటకు వచ్చింది. ఈసారి ఎక్కడ గణపయ్య కిరీటం సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారింది. లాల్‌బాగ్ రాజా కిరీటం రూ.16 కోట్లతో తయారైంది.

Vinayaka Chavithi 2024: ఇష్టదైవానికి అనంత్ అంబానీ అదిరిపోయే కానుక .. 20 కేజీల బంగారంతో..
Lalbagh Ganesh2024
Follow us on

దేశవ్యాప్తంగా వినాయక చవితి సందడి మొదలైంది. గణపతి ఉత్సవాలు జరుపుకోవడానికి ఊరూవాడా సిద్దం అవుతుంది. దేశ వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకుంటున్నప్పటికీ.. మహారాష్ట్రలో మాత్రం వినాయక చవితి పండుగకి పెట్టింది పేరు. ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలను చాలా ప్రత్యేకంగా జరుపుకోవడం తెలిసిందే. అయితే ఐకానిక్ లాల్‌బాగ్చా రాజా వినాయక ఉత్సవం మాత్రం వెరీ వెరీ స్పెషల్. ఇక్కడికి గణపయ్య ముఖదర్శనం చేసుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు. ఈసారి లాల్‌బాగ్ రాజు మొదటి చిత్రం బయటకు వచ్చింది. ఈసారి ఎక్కడ గణపయ్య కిరీటం సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారింది. లాల్‌బాగ్ రాజా కిరీటం రూ.16 కోట్లతో తయారైంది.

పెళ్లి జరిగిన తర్వాత వచ్చిన మొదటి పండగ వినాయక చవితి.. ఈ సందర్భంగా లాల్‌బాగ్ రాజా వినాయకుడికి అనంత్ అంబానీ 20 కేజీల బంగారు కిరీటాన్ని బహుమతిగా ఇచ్చాడు. కోట్ల విలువ జేసే ఈ కిరీటాన్ని దాదాపు 2 నెలల కష్టపడి తయారు చేసినట్లు ఆలయ కమిటీ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

ఈ ఏడాది గణేశోత్సవం సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానుండడంతో ఇక్కడ సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి. పండల్‌ను (మండపాన్ని) అందంగా అలంకరించారు. వినాయక విగ్రహం ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. విఘ్నాలకధిపతి గణపతి చేతిలో చక్రం, నుదుటిపై త్రిశూల తిలకం ధరించిన భక్తులను మంత్రముగ్ధులను చేసేందుకు రెడీ అయ్యాడు. బంగారు ఆభరణాలతో అలంకరించడంతో మిలమిలా మెరుస్తున్నాడు.

మస్లిన్ దుస్తులలో బప్పా అద్భుతమైన దృశ్యం

లాల్‌బాగ్ రాజ వినాయకుడు మెరూన్ కలర్ మస్లిన్ దుస్తులు ధరించాడు. మూడు రంగులలో తయారు చేసిన పువ్వుల మాల ధరించాడు. అందంగా ఆకర్షణీయంగా బొజ్జ గణపయ్య దివ్య రూపం కనుల విందు చేస్తుంది.

సెలబ్రిటీలు సైతం క్యూలు

లాల్‌బాగ్ రాజు వినాయకుడి ఉత్సవాలు చూసేందుకు సామాన్యులు మాత్రమే కాదు సెలబ్రేటీలు సైతం క్యూలు కడతారు. దేశవిదేశాలకు చెందిన సినీ రాజకీయ ప్రముఖులు, వివిఐపీలు కూడా వినాయకుడిని దర్శించుకుంటారు. అందులో ముకేష్ అంబానీ కుటుంబం కూడా ఒకటి.

ఉచితంగా సేవలు అందిస్తున్న అగ్నిమాపక సిబ్బంది

లాల్‌బాగ్ రాజా కోసం ఈ సంవత్సరం అగ్నిమాపక దళం కూడా బోర్డుకు తన సేవలను ఉచితంగా అందించాలని నిర్ణయించింది. లైబ్రరీలు, ఆసుపత్రులకు కోట్లాది రూపాయల విరాళం అందజేయడమే కాదు అనేక సామాజిక కార్యక్రమాలు లాల్‌బాగ్ రాజా ద్వారా కూడా జరుగుతాయన్న సంగతి తెలిసిందే.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..