Tirumala: 2021లో శ్రీవారిని దర్శించుకున్న కోటి మంది భక్తులు..టీటీడీకి రూ.833 కోట్ల వార్షిక ఆదాయం..

|

Jan 01, 2022 | 5:30 PM

Tirumala: 2021సంవత్సరంలో హిందువుల ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి. 2021 లో కూడా కరోనా నిబంధనల నడుమ శ్రీవారి దర్శనాన్ని చేసుకునే అవకాశం టీటీడీ అధికారులు కల్పించారు. ఈ నేపథ్యంలో స్వామివారిని దేశవిదేశాల నుంచి ప్రముఖులతో పాటు అనేక మంది శ్రీవారి భక్తులు దర్శించుకున్నారు. 2021 లో స్వామివారిని దర్శించుకున్న భక్తులు, హుండీకానుకల వివరాల్లోకి వెళ్తే..

1 / 6
2021 జనవరి 1 నుంచి డిసెంబర్ 30 మధ్య కాలంలో శ్రీవారి 'హుండీ' వసూళ్లు రూ. 833 కోట్లని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ప్రపంచంలోని అత్యంత ధనిక పుణ్యక్షేత్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయాన్ని టీటీడీ నిర్వహిస్తోంది

2021 జనవరి 1 నుంచి డిసెంబర్ 30 మధ్య కాలంలో శ్రీవారి 'హుండీ' వసూళ్లు రూ. 833 కోట్లని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ప్రపంచంలోని అత్యంత ధనిక పుణ్యక్షేత్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయాన్ని టీటీడీ నిర్వహిస్తోంది

2 / 6
కొండపైన ఉన్న పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్న భక్తులు. 1.04 కోట్ల మంది ఉన్నారు. స్వామివారి ప్రసాదం లడ్డులు 5.96 కోట్లు, 1.37 కోట్ల అన్నప్రసాదాన్ని విక్రయించింది. 48.75 లక్షల మంది కల్యాణకట్ట  దగ్గర తమ మొక్కులు చెల్లించుకున్నారని తెలిపింది. దీంతో  2021 ఏడాదిలో 1 కోటి మంది భక్తులు తిరుమలను సందర్శించారని .. హుండీ వసూళ్లు మొత్తం రూ.833 కోట్లని ప్రకటించింది.

కొండపైన ఉన్న పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్న భక్తులు. 1.04 కోట్ల మంది ఉన్నారు. స్వామివారి ప్రసాదం లడ్డులు 5.96 కోట్లు, 1.37 కోట్ల అన్నప్రసాదాన్ని విక్రయించింది. 48.75 లక్షల మంది కల్యాణకట్ట దగ్గర తమ మొక్కులు చెల్లించుకున్నారని తెలిపింది. దీంతో 2021 ఏడాదిలో 1 కోటి మంది భక్తులు తిరుమలను సందర్శించారని .. హుండీ వసూళ్లు మొత్తం రూ.833 కోట్లని ప్రకటించింది.

3 / 6
2021 మే నెలలో ఇక నుంచి స్వామి వారి స్థిరాస్తులను వేలం వేయరాదని.. క్రయవిక్రయాలు జరపరాదని టిటిడీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. తిరుపతిలోని తిరుమల కొండల్లో వెలసిన వేంకటేశ్వర స్వామికి భక్తులు విరాళంగా ఇచ్చిన స్థిరాస్తులను ఇక నుంచి భద్రంగా కాపాడాలని నిర్ణయించించి.

2021 మే నెలలో ఇక నుంచి స్వామి వారి స్థిరాస్తులను వేలం వేయరాదని.. క్రయవిక్రయాలు జరపరాదని టిటిడీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. తిరుపతిలోని తిరుమల కొండల్లో వెలసిన వేంకటేశ్వర స్వామికి భక్తులు విరాళంగా ఇచ్చిన స్థిరాస్తులను ఇక నుంచి భద్రంగా కాపాడాలని నిర్ణయించించి.

4 / 6
ఇదే విషయంపై టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. శ్రీవారి ఆస్తులను ఆదాయాన్ని ఏ విధంగా  వినియోగించుకోవాలో అనే విషయంపై అధ్యయనం చేసేందుకు అధికారులు, మేధావులు, హిందూ ధార్మిక సంస్థల అధినేతలు, భక్తులతో కూడిన కమిటీని త్వరలో ఏర్పాటు చేయాలని బోర్డు నిర్ణయించినట్లు తెలిపారు. స్వామివారి విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. స్వామివారి ఆస్తుల విక్రయాలపై నిషేధం విధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ చైర్మన్ తెలిపారు.

ఇదే విషయంపై టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. శ్రీవారి ఆస్తులను ఆదాయాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలో అనే విషయంపై అధ్యయనం చేసేందుకు అధికారులు, మేధావులు, హిందూ ధార్మిక సంస్థల అధినేతలు, భక్తులతో కూడిన కమిటీని త్వరలో ఏర్పాటు చేయాలని బోర్డు నిర్ణయించినట్లు తెలిపారు. స్వామివారి విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. స్వామివారి ఆస్తుల విక్రయాలపై నిషేధం విధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ చైర్మన్ తెలిపారు.

5 / 6
అదేవిధంగా, మొత్తం శ్రీవారి ఆస్తులు, ఆభరణాలు, ఆదాయవ్యయాలపై పూర్తి వాస్తవాలను వెలికి తీయడానికి విజిలెన్స్ కమిషన్ లేదా మరేదైనా దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని టిటిడి బోర్డు నిర్ణయించింది.

అదేవిధంగా, మొత్తం శ్రీవారి ఆస్తులు, ఆభరణాలు, ఆదాయవ్యయాలపై పూర్తి వాస్తవాలను వెలికి తీయడానికి విజిలెన్స్ కమిషన్ లేదా మరేదైనా దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని టిటిడి బోర్డు నిర్ణయించింది.

6 / 6
ఇక శీవారి వారి దర్శనం చేసుకునే భక్తుల సంఖ్యను పెంచడానికి తాము కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని బోర్డు ఛైర్మన్ తెలిపారు. ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చిన వెంటనే శ్రీవారి దర్శనాల సంఖ్య పెంచడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

ఇక శీవారి వారి దర్శనం చేసుకునే భక్తుల సంఖ్యను పెంచడానికి తాము కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని బోర్డు ఛైర్మన్ తెలిపారు. ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చిన వెంటనే శ్రీవారి దర్శనాల సంఖ్య పెంచడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.