
ఓ ఇంట్రస్టింగ్ డేటా చెప్పుకుందాం.. ఫెడరేషన్ ఆఫ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆమధ్య బెంగళూరులో ఓ మీటింగ్ పెట్టింది. 2047 నాటికి భారత్లో టూరిజం ఎలా ఉండబోతోంది, ఎలాంటి స్ట్రాటజీలు అవసరం అనే దానిపై. వందలమంది డెలిగేట్స్ వెళ్లారు ఆ మీటింగ్కి. ప్రెస్టీజియన్ హోటల్స్ రిప్రజెంటీవ్స్, పాలసీ మేకర్స్, ట్రావెల్ ఏజెంట్స్, టూరిజం ఫెసిలిటేటర్స్.. ఇలా ఎంతోమంది అటెండ్ అయ్యారు. Agoda తెలుసుగా.. ఆ సంస్థ ఓ ప్రశ్న వేసింది. ‘ఇంతకీ.. ఏ టూరిస్ట్ స్పాట్ గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు ఈ టూరిస్టులు’ అని అడిగింది. గోవా, ఊటీ, కులు-మనాలి, జమ్మూకశ్మీర్.. ఇవేవీ కావట. తిరుపతి ఫస్ట్ ప్లేస్లో ఉందిట. ఇంట్రస్టింగ్ కదా. ఆధ్యాత్మికమే పర్యాటకం. దైవచింతన కోసం వెళ్లడమే టూరిజం మనదగ్గర. జనాల్లో భక్తి పెరిగిందనడానికి ఇంతకు మించిన ప్రూఫ్ ఏం కావాలి..! బట్.. ఈ భక్తి మనిషిని ఎటువైపు తీసుకెళ్తోంది. సన్మార్గానికా, ఉన్నమార్గంలోనే ఉండడానికా? చార్ధామ్ యాత్ర. అత్యంత కఠినమైంది. ఒకనాడు ‘కాశికి వెళ్లినవాడు కాటికి వెళ్లినవాడు ఒకటే’ అనే సామెత ఉండేది. కాశీ మీద చెప్పలేని మమకారమో.. ఏ వాసనా విశేషమో.. తిరిగి స్వస్థలానికి వచ్చివేయాలి అనే ఆలోచన అక్కడి గాలి సోకిన వాడికి కలగదు అని ఒక...