Ramayana: రాముడికి ఒక అక్క ఉన్న సంగతి తెలుసా.. దత్తతకు వెళ్లిన శాంతాదేవి త్యాగంతోనే దశరథుడికి పుత్ర సంతానం కలిగిందని తెలుసా..

కుమార్తెను దత్తత ఇచ్చిన తర్వాత దశరథ రాజుకు సంతానం కలగలేదు. దశరథ రాజు చాలా కలత చెందడం ప్రారంభించాడు. ఆపై అతను తన సమస్యను వశిష్ఠ మహర్షికి చెప్పాడు.

Ramayana: రాముడికి ఒక అక్క ఉన్న సంగతి తెలుసా.. దత్తతకు వెళ్లిన శాంతాదేవి త్యాగంతోనే దశరథుడికి పుత్ర సంతానం కలిగిందని తెలుసా..
Dasharatha Daughter Shanta

Updated on: Sep 25, 2022 | 7:37 PM

Ramayana: రామాయణంలోని పాత్రల ప్రస్తావన వచ్చినప్పుడల్లా దశరథ రాజు నలుగురు కుమారుల గురించి చర్చ జరుగుతుంది. అయితే దశరథ మహారాజు కుమార్తె గురించి కాదు. దశరథుడికి ఒక కూతురు కూడా ఉందనే విషయం కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆమె పేరు శాంత. వాల్మీకి రామాయణంలోని బాల కాండలో శాంతా దేవి ప్రస్తావన ఉంది. విష్ణు పురాణంలో దశరథ రాజు,  కౌశల్య దంపతుల కుమార్తెగా వర్ణించబడింది. శాంతాదేవికి సంబంధించిన ఒక సంఘటన విష్ణు పురాణంలో వివరించబడింది.

విష్ణు పురాణం ప్రకారం.. ఒకసారి రాణి వర్షిణి, రాణి కౌసల్య సోదరి, అయోధ్యకు చేరుకుంది. వర్షిణి అంగదేశ రాజు సోమవాదు భార్య. అయితే పెళ్లయి చాలా కాలం గడిచినా వారికి సంతానం కలగలేదు. శాంత దేవిని చూడగానే రాణి వర్షిణికి పిల్లలపై ప్రేమకలిగింది. తనకు పిల్లలు లేరనే విషయం గుర్తుకు వచ్చి దుఃఖించింది.

దత్తతకు వెళ్లిన దశరథుడు కుమార్తె:
రాణి వర్షిణి ముఖంలో దుఃఖం కనిపించడం చూసిన దశరథ రాజు అశాంతికి కారణం అడిగాడు. రాణి వర్షిణి మాట్లాడుతూ.. తనకు కూడా శాంత లాంటి కూతురు ఉంటే.. ఎంతో సంతోషంగా ఉంటాను. నేను కూడా నవ్వుతాను అని చెప్పింది. పిల్లల కోరికతో, రాణి వర్షిణి శాంతను దత్తత తీసుకోవడం గురించి దశరథ రాజుకు చెప్పింది. రాణి వర్షిణి దీనస్థితిని చూసిన దశరథ రాజు తన కుమార్తె శాంతను దత్తత ఇస్తానని వాగ్దానం చేశాడు. ఈ విధంగా మహారాజు కుమార్తె శాంత అంగ దేశానికి యువరాణి అయింది.

ఇవి కూడా చదవండి

శాంత దేవిని ఆమె పిన్ని పెంచింది. రామాయణంలో కౌసల్య సోదరి గురించి ప్రస్తావించనట్లే.. శాంత దేవి గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. శాంతా దేవి అందంగా ఉంటుంది. అంతేకాదు..  వేదాలు, కళలు అభ్యసించింది.

రిషి శృంగిని వివాహం చేసుకున్న శాంత:
శాంత దేవి వివాహం ఇతివృత్తం కూడా విష్ణు పురాణంలో పేర్కొన్నారు. ఒకప్పుడు అంగ దేశంలో కరువు పరిస్థితులు ఉండేవి. పరిస్థితి క్రమంగా దిగజారడం ప్రారంభించింది. కరువు వచ్చినప్పుడు.. రాజు శృంగి మహర్షిని ఆహ్వానించి సమస్యకు పరిష్కారం అడిగాడు. శృంగి మహర్షి యాగం చేయమని చెప్పి.. పూర్ణ క్రతువులతో యాగం నిర్వహించారు. రాష్ట్రంలో వర్షాలు కురిసి అందరి ముఖాలు వికసించాయి. దేశం సమస్యను పరిష్కరించడంలో.. రాజు సోమపాదుడు రిషి శృంగితో తన కుమార్తె శాంతను ఇచ్చి వివాహం చేశారు. ఋషి శృంగి గొప్ప మహర్షి. అతను నివసించిన చోట శాంతి, సంపదలు ఉంటాయి. ఎక్కడ అడుగు వేసినా పచ్చదనం ఉండేది.

కుమార్తెను దత్తత ఇచ్చిన తర్వాత దశరథ రాజుకు సంతానం కలగలేదు. దశరథ రాజు చాలా కలత చెందడం ప్రారంభించాడు. ఆపై అతను తన సమస్యను వశిష్ఠ మహర్షికి చెప్పాడు. అల్లుడైన శృంగి ఋషితో పుత్రకామేష్టి యాగం నిర్వహించమని వశిష్ఠ మహర్షి దశరథుడికి సలహా ఇచ్చాడు. శృంగి ఋషి పేరు వినగానే తన కూతురు గుర్తొచ్చి.. శృంగి ఋషి వద్దకు చేరుకుని తనకు పుత్ర యోగం కోసం యాగం చేయమంటూ కోరాడు.

దశరధుడు కోరిక విన్న ఋషి శృంగి మాట్లాడుతూ ఎవరైతే ఈ యాగాన్ని నిర్వహిస్తారో వారి పుణ్యం, తపస్సు మహిమ అంతా సమాప్తమవుతుందని తన భార్య శాంతతో చెప్పాడు. అంతేకాదు.. నేను రాజప్రాకారంలో యజ్ఞం చేస్తున్న సమయంలో నువ్వు అడవిలో నివసించాలని శాంతకు చెప్పాడు. అది విన్న శాంతా దేవి తన భర్తను ఒప్పించి. తాను ఎన్ని కష్టాలు అయినా భరిస్తాను.. తన తల్లిదండ్రుల కోసం పుత్రకామేష్టి యాగం చెయ్యాలని కోరింది. ఈ విధంగా శాంత దేవి యాగం చేయడానికి తన భర్త ఋషి శృంగిని ఒప్పించింది.

దశరథ రాజుకు సంతానం కోసం శృంగి ఋషి యజ్ఞం చేశాడు. యజ్ఞం విజయవంతమైంది. దశరథ రాజుకు నలుగురు కుమారులు రాముడు, భరతుడు,  కవలలు లక్ష్మణుడు మరియు శత్రుఘ్నలు ఉన్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us