Tirumala: తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం

|

May 19, 2024 | 9:19 PM

చతుర్వేద పారాయణం, అనంతరం భైరవి, నళినకాంతి, శంకరాభరణం, హిందుస్తానీ, నాదస్వరంపై నీలాంబరి రాగాలు, మేళం, ఢమరుక వాయిద్యం మొదలైన వాటిని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, ఎస్ఈ 2 జగదీశ్వర్ రెడ్డి, డీవైఈవో లోకనాథం, భక్తులు పాల్గొన్నారు.

Tirumala: తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
Tirumala
Follow us on

తిరుమలలో మూడురోజుల పాటు నిర్వహించిన పద్మావతి పరిణయోత్సవాలు ఆదివారం సాయంత్రం ఘనంగా ముగిసాయి. చివరి రోజు శ్రీదేవి, భూదేవి వేర్వేరుగా రెండు వాహనాలపై రాగా మలయప్ప స్వామి గరుడ వాహనం పై వేదిక వద్దకు చేరుకున్నారు.

ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్ల ఎదురుకోలు, పూబంతాట, వరణమయురం కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. చతుర్వేద పారాయణం, అనంతరం భైరవి, నళినకాంతి, శంకరాభరణం, హిందుస్తానీ, నాదస్వరంపై నీలాంబరి రాగాలు, మేళం, ఢమరుక వాయిద్యం మొదలైన వాటిని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, ఎస్ఈ 2 జగదీశ్వర్ రెడ్డి, డీవైఈవో లోకనాథం, భక్తులు పాల్గొన్నారు.

మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీకెండ్ తో పాటు వేసవి సెలవుల దృష్ట్యా శ్రీవారి దర్శనానికి భారీగా తరలివస్తున్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థులకు దాదాపు అన్ని విద్యా పరీక్షలు పూర్తయినందున మేలో మధ్య వేసవి సెలవుల రద్దీ ఈ వారాంతంలో గరిష్ట స్థాయికి చేరుకుంది. దాదాపు 5 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఔటర్ రింగ్ రోడ్డులో కల్యాణ వేదిక వద్ద ప్రారంభమయ్యే బయట లైన్లకు బారికేడ్లు ఏర్పాటు చేయడం ద్వారా భక్తుల రద్దీ కోసం టిటిడి విస్తృత ఏర్పాట్లు చేసింది. శ్రీవారి సేవా వాలంటీర్ల సహకారంతో కృష్ణ తేజ సర్కిల్ వరకు వివిధ ప్రాంతాలలో అన్నప్రసాదం నిరంతర సరఫరా, నీటి పంపిణీ బయట లైన్లలో ఉండేలా చూసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..