అక్షరధామ్ క్షేత్రంలో అద్భుత ఘట్టం.. వైభవంగా 108 అడుగుల నీలకంఠ వర్ణి విగ్రహ ప్రతిష్ఠాపన

108-Ft Neelkant Varni Statue Inaugurated: ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రమైన న్యూఢిల్లీలోని స్వామినారాయణ అక్షరధామ్ క్షేత్రంలో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. భగవాన్ స్వామినారాయణ బాల్య స్వరూపమైన 'నీలకంఠ వర్ణి' 108 అడుగుల భారీ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం గురువారం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగింది.

అక్షరధామ్ క్షేత్రంలో అద్భుత ఘట్టం.. వైభవంగా 108 అడుగుల నీలకంఠ వర్ణి విగ్రహ ప్రతిష్ఠాపన
Neelkant Varni Statue

Updated on: Mar 26, 2026 | 12:06 PM

ఢిల్లీలోని స్వామినారాయణ అక్షరధామ్ క్షేత్రంలో 108 అడుగుల భారీ నీలకంఠ వర్ణి విగ్రహ ప్రతిష్ఠాపన అత్యంత వైభవంగా జరిగింది. పరమ పూజ్య మహంత్ స్వామి మహారాజ్ పవిత్ర సమక్షంలో గురువారం ఉదయం 6 గంటల నుండి వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రతిష్ఠాపన క్రతువు ప్రారంభమైంది. మహంత్ స్వామి మహారాజ్ స్వయంగా 108 అడుగుల ఎత్తులో వైదిక విధులను పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విగ్రహం అత్యంత సుందరమైనదని తెలిపారు. ఇది ప్రపంచమంతటా శాంతిని ప్రసాదిస్తుందని.. ఇక్కడికి వచ్చే భక్తులకు నీలకంఠ వర్ణి ఆశీస్సులు, సద్గుణాలు లభిస్తాయని ఆయన తెలిపారు.

Neelkant Varni Statue

ఈ విగ్రహం ప్రపంచంలోకెళ్లా ఒకే పాదంపై నిలబడిన అత్యంత ఎత్తైన విగ్రహంగా రికార్డు సృష్టించింది. కేవలం 11 ఏళ్ల వయస్సులోనే నీలకంఠ వర్ణి సుమారు ఏడేళ్ల పాటు దేశమంతా చేసిన కల్యాణ యాత్రకు నిదర్శనంగా ఈ విగ్రహం నిలువనుంది. ముఖ్యంగా పులహాశ్రమంలో నాలుగు నెలల పాటు ఆహారం తీసుకోకుండా ఒంటి కాలిపై నిలబడి ఆయన చేసిన తపస్సుకు నిదర్శనంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

Neelkant Varni Statue 

మార్చి 25, 26 తేదీలలో జరిగిన ఈ ఉత్సవాల్లో ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది భక్తులు, సుమారు 300 మంది సాధువులు పాల్గొన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా లోక కల్యాణం కోసం, ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలు ఆగి ప్రపంచమంతా శాంతి నెలకొనలాని బుధవారం’విశ్వశాంతి యజ్ఞం’ నిర్వహించారు. అనంతరం శాంతికి చిహ్నంగా తెల్లని పావురాలను అకాశంలోకి ఎగురవేశారు.

మరిన్ని అథ్యాత్మిక వార్తల కసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us