Chinna Jeeyar Swami : రామాయణంపై ఈ నెల 24న గ్లోబల్ క్విజ్ .. ఇవిగో పూర్తి వివరాలు
రామాయణ మహాకావ్యంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అంతర్జాతీయ స్థాయిలో క్విజ్ నిర్వహించున్నట్టు త్రిదండి చిన్నజీయర్ స్వామి ప్రకటించారు. స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించే ఈ క్విజ్లో విజేతలకు 9 లక్షల రూపాయల విలువైన బహుమతులు అందజేయనున్నారు. ఈ క్విజ్కు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు, రిజిస్టర్ చేసుకునేందుకు ప్రత్యేకంగా వెబ్సైట్ కూడా ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24న ఈ క్విజ్ నిర్వహిస్తామని చిన్నజీయర్ స్వామి వెల్లడించారు. వయస్సును బట్టి ఈ క్విజ్ మూడు విభాగాల్లో కంప్యూటర్ ఆధారితంగా ఉంటుంది.
సమతా మూర్తి రెండో వార్షికోత్సవం సందర్భంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అంతర్జాతీయ సెమినార్ మూడు రోజులు పాటు నిర్వహించనున్నట్టు చినజీయర్ స్వామి తెలిపారు. ప్రపంచదేశాలకు చెందిన వైజ్ఞానికులు ఈ సదస్సులో పాల్గొంటారని వెల్లడించారు. పార్లమెంట్ కొత్త భవనంలో అడుగుపెట్టిన పాలకులకు ఈ సందర్భంగా చిన్నజీయర్ స్వామి మంగళశాసనాలు తెలిపారు. సమతామూర్తి రెండో వార్షికోత్సవం సమతా కుంభ్ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 20 నుంచి 29 వరకు నిర్వహించనున్నట్టు చిన్నజీయర్ స్వామి ప్రకటించారు. వీటితో పాటు ఈ ఏడాది దసరా నుంచి సమతామూర్తి సన్నిధిలోని దివ్యదేశాల్లో ప్రత్యేక సేవల్లో పాల్గొనే అవకాశం భక్తులకు కల్పిస్తున్నట్టు చిన్నజీయర్ స్వామి వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మగ తోడు ఉంటేనే పిల్లల్ని కనగలరా? మరి ఈ చేప సంగతేంటి?
5,300 ఏళ్ల నాడు తిన్న తిండి.. ఇంకా అరుగుతూనే ఉంది
ఆకాశంలో వింత కాంతులు! ఆత్మలా? ఏలియన్సా?
ఆకారం భారీగా.. కానీ చేతులు చిన్నవిగా? ఇజ్జత్ మొత్తం పాయె!
ప్రపంచంలోనే ఖరీదైన గ్రీన్ టీ.. కారణం ఇదే
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!

