రాజధాని నిర్మాణానికి 2 వేల 500 కోట్లు విడుదల చేశాం: నిర్మలా సీతారామన్
లోక్సభలో ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వం 6 వేల 764 కోట్ల రూపాయలను విడుదల చేసిందని ఆమె తెలిపారు. రాజధాని నిర్మాణానికి 2 వేల 500 కోట్లు, రెవెన్యూ లోటు భర్తీకి 3 వేల 979 కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేసినట్లు పేర్కొన్నారు. మంగళగిరిలో ఎయిమ్స్ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలిపామని చెప్పారు. ప్రస్తుతం తాత్కాలిక క్యాంపస్లో 2018-19 […]
లోక్సభలో ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వం 6 వేల 764 కోట్ల రూపాయలను విడుదల చేసిందని ఆమె తెలిపారు. రాజధాని నిర్మాణానికి 2 వేల 500 కోట్లు, రెవెన్యూ లోటు భర్తీకి 3 వేల 979 కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేసినట్లు పేర్కొన్నారు. మంగళగిరిలో ఎయిమ్స్ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలిపామని చెప్పారు. ప్రస్తుతం తాత్కాలిక క్యాంపస్లో 2018-19 ఎంబీబీఎస్ బ్యాచ్ను 50 మంది విద్యార్థులతో ప్రారంభించినట్లు తెలిపారు. ఏపీ పునర్విభజన చట్టంలోని చాలా అంశాలను అమలు చేశామన్న కేంద్ర ఆర్థికమంత్రి… విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి డీపీఆర్లు రావాల్సి ఉందన్నారు.