యాంకర్గా రాంగోపాల్ వర్మ
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రమోషన్స్ను వేగవంతం చేస్తూ టీవీ 5 ఛానల్కి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి వెళ్లిన రాంగోపాల్ వర్మ న్యూస్ యాంకర్గా మారారు. ఆ కార్యక్రమానికి యాంకర్గా ఉన్న మూర్తికి బదులు బులిటెన్ హెడ్ లైన్స్ చదివి వారెవ్వా వర్మా అనిపించారు. మూర్తికంటే మీరే వార్తలు బాగా చదువుతున్నారని నెటిజన్లు స్పందిస్తున్నారంటే వర్మలోని టాలెంట్ను అర్ధం చేసుకుకోవచ్చు. ఎక్కడా తడబాటు లేకుండా.. ఆన్ ఎయిర్ విజువల్స్కి తగ్గట్టుగా స్కిప్ట్ను హెడ్లైన్స్ ఫ్లోలో చక్కగా చదివారు. […]
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రమోషన్స్ను వేగవంతం చేస్తూ టీవీ 5 ఛానల్కి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి వెళ్లిన రాంగోపాల్ వర్మ న్యూస్ యాంకర్గా మారారు. ఆ కార్యక్రమానికి యాంకర్గా ఉన్న మూర్తికి బదులు బులిటెన్ హెడ్ లైన్స్ చదివి వారెవ్వా వర్మా అనిపించారు. మూర్తికంటే మీరే వార్తలు బాగా చదువుతున్నారని నెటిజన్లు స్పందిస్తున్నారంటే వర్మలోని టాలెంట్ను అర్ధం చేసుకుకోవచ్చు. ఎక్కడా తడబాటు లేకుండా.. ఆన్ ఎయిర్ విజువల్స్కి తగ్గట్టుగా స్కిప్ట్ను హెడ్లైన్స్ ఫ్లోలో చక్కగా చదివారు.
ఈ సంఘటనతో యాంకర్ మూర్తి సైతం ఆశ్చర్యపోయారు. చాలా బాగా చదివారు వర్మగారూ.. టెన్షన్ ఏమైనా పడ్డారా? అంటే కొంచెం అలానే ఉందన్నారు వర్మ. ఎక్కడ టెన్షన్ పడ్డారు.. చంద్రబాబుని పొగుడుతూ, జగన్కి ఓటు వేయొద్దు అన్నప్పుడేనా అంటూ మూర్తి వ్యంగ్యంగా అడగటంతో.. కాదు హెడ్ లైన్స్ కమాండ్ బులిటెన్ ప్రొడ్యుసర్ నుండి వచ్చినప్పుడు అంటూ తనదైన శైలిలో సమాధానం చెప్పారు వర్మ. తాజాగా తాను ఫస్ట్ టైం న్యూస్ హెడ్ లైన్స్ చదివా అంటూ వీడియోని షేర్ చేశారు వర్మ.