నోరు మూసుకునే కన్నా.. చావడం మిన్న: పీవీపీ సంచలన ట్వీట్
ప్రముఖ సినీ నిర్మాత, వైసీపీ నేత పీవీపీ సంచలన ట్వీట్ వేశారు. ''తప్పుని తప్పు అనడం తప్పు అయితే, ఆ తప్పు ఎన్ని లక్షల సార్లు అయినా చేయవచ్చు.
ప్రముఖ సినీ నిర్మాత, వైసీపీ నేత పీవీపీ సంచలన ట్వీట్ వేశారు. ”తప్పుని తప్పు అనడం తప్పు అయితే, ఆ తప్పు ఎన్ని లక్షల సార్లు అయినా చేయవచ్చు. నోరు మూసుకునే కన్నా, చావడం మిన్న” అని పీవీపీ ట్వీట్ చేశారు.
కాగా పీవీపీపై హైదరాబాద్లో బుధవారం కేసు నమోదైన విషయం తెలిసిందే. తన ఇంటి నిర్మాణంలో మార్పులు చేసుకుంటుంటే పీవీపీ అనుచరులతో వచ్చి దాడి చేశాడని, అసభ్యకరంగా మాట్లాడారని విక్రమ్ కైలాష్ అనే వ్యక్తి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు పీవీపీపై ఐపీసీ 447, 427, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇందులో భాగంగా ఇవాళ ఏసీపీ ముందు విచారణకు హాజరు కావాలని 41 సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పీవీపీ ఈ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది.
Read This Story Also: బాంబు పేలుడులో నలుగురు దుర్మరణం.. మృతుల్లో ఇద్దరు చిన్నారులు..